News April 1, 2024

కచ్చతీవు ద్వీపం వ్యవహారం ఏంటి?

image

ఎన్నికల ప్రచారంలో తాజాగా ప్రధాని మోదీ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై విరుచుకుపడ్డారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ ద్వీపాన్ని శ్రీలంకకు ఇవ్వడాన్ని గుర్తు చేశారు. అప్పగింతకు ముందు 1968లోనే ఈ భూభాగాన్ని తమ మ్యాప్‌లో చూపించిన శ్రీలంక ప్రధానితో ఇందిర మాట్లాడటం రాజకీయంగా దుమారం రేపింది. అలా 285ఎకరాల ద్వీపాన్ని సముద్ర ఒప్పందం కింద అప్పగించడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News February 13, 2026

తల్లిపాల గురించి ఈ విషయాలు తెలుసా?

image

తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకే కాదు.. పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. పిల్లలకి పాలివ్వడం వల్ల తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయంటున్నారు నిపుణులు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తల్లిపాలు శిశువుకు సులువుగా అరగడంతో పాటు రోగనిరోధకశక్తిని అందిస్తాయి. కాబట్టి తల్లిపాలివ్వడం ముఖ్యమని చెబుతున్నారు.

News February 13, 2026

RR కెప్టెన్‌గా రియాన్ పరాగ్!

image

రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఐపీఎల్ సీజన్‌లోనూ కొన్ని మ్యాచ్‌లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంజూ శాంసన్‌ను చెన్నై కొనుగోలు చేయడంతో పరాగ్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.

News February 13, 2026

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ

image

TG: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. నందికొండ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 11 చోట్ల గెలిచారు. BRS ఒక స్థానంలో విజయం సాధించింది. ఇదే జిల్లాలోని హాలియాలో 12 వార్డులకు గాను కాంగ్రెస్ పదింట్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. BRS రెండు వార్డుల్లో విజయం సాధించింది. చండూరు, చిట్యాల మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.