News February 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739066058923_653-normal-WIFI.webp)
హైదరాబాద్లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. గత ఆదివారం KG చికెన్ స్కిన్లెస్ రేట్ రూ.240-250 ఉండగా ఇవాళ రూ.220-230గా ఉంది. అయితే AP, TGలోని పలు జిల్లాల్లో రేట్లలో తేడాలున్నాయి. ఇటీవల అంతుచిక్కని వైరస్ కారణంగా కోళ్లు చనిపోతున్న కృష్ణా, ప.గో, నిజామాబాద్ జిల్లాల్లో ధర రూ.200 దిగువకు పడిపోయింది. అటు మరికొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.280 కూడా పలుకుతోంది. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
Similar News
News February 9, 2025
దారుణం: ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737718673775_1032-normal-WIFI.webp)
AP: ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. కంచికచర్ల మండలంలోని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫొటోలు తీసి మరో ఇద్దరు స్నేహితులకు పంపించాడు. వారు ఆ ఫొటోలతో బాధితురాలిని బెదిరించారు. దీంతో వేధింపులు తాళలేక పేరెంట్స్తో కలిసి బాధితురాలు కంచికచర్ల పీఎస్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 9, 2025
రేపటి నుంచి ‘భాగ్యనగర్’ బంద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739073867605_81-normal-WIFI.webp)
TG:ఉత్తర తెలంగాణ వాసుల వరప్రదాయిని భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ 11 రోజుల పాటు నిలిచిపోనుంది. 3వ లైన్ పనుల కారణంతో సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య నడిచే ఈ రైలు రాకపోకలను ఈ నెల 10 నుంచి 21 వరకు నిలిపివేశారు. సికింద్రాబాద్ నుంచి కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, పొత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్నగర్ వరకు దీనిలో నిత్యం ప్రయాణించేవారుంటారు. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు తిప్పలు తప్పవు.
News February 9, 2025
బీజేపీ బలోపేతానికి కారణమే మీరు.. కేటీఆర్కు కోమటిరెడ్డి కౌంటర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739072476025_653-normal-WIFI.webp)
TG: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం నేపథ్యంలో రాహుల్ గాంధీకి <<15396872>>అభినందనలు<<>> తెలిపిన కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం సొంత పార్టీకి సున్నా సీట్లు అందించిన గొప్ప నాయకత్వం ఆయనదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావడానికి బీఆర్ఎస్సే కారణమని కోమటిరెడ్డి ఆరోపించారు.