News April 6, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల చికెన్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ నగరంలో గత వారం స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.280 ఉండగా నేడు రూ.230గా ఉంది. విజయవాడలో కేజీ రూ.310 నుంచి రూ.270కి తగ్గింది. బర్డ్ ఫ్లూతో ఏపీలో ఓ చిన్నారి మృతి చెందిందన్న వార్తల ప్రభావం ధరలపై చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా చాలా మంది నాన్-వెజ్ తినేందుకు ఇష్టపడట్లేదు.

Similar News

News April 7, 2025

ఆస్పత్రిలో SRH ప్లేయర్

image

నిన్న GTతో మ్యాచులో SRH హర్షల్ పటేల్‌ను తీసుకుంటే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. దానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. దీంతో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మరో పేసర్ ఉనద్కత్‌ను జట్టులోకి తీసుకున్నారు. నిన్న స్లో పిచ్‌పై హర్షల్ కీ బౌలర్ అయ్యేవారని, ఆయన లేకపోవడం SRHను దెబ్బతీసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News April 7, 2025

నేడు భద్రాచలం శ్రీరాముడి మహాపట్టాభిషేకం

image

TG: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో నేడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉ.10.30 గం. నుంచి మ.12.30 వరకు కళ్యాణ మండపంలో అభిషేక మహోత్సవం ఉంటుంది. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, చక్రాలు, కిరీటం, శంఖు ధరింపజేస్తారు. ఏటా శ్రీరామనవమి తర్వాత నిర్వహించే ఈ వేడుకకు ఈసారి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

News April 7, 2025

IPL: నేడు ముంబైతో ఆర్సీబీ ఢీ

image

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు రాత్రి 7.30 గంటలకు వాంఖడేలో ముంబై, బెంగళూరు తలపడనున్నాయి. ముంబైకి రోహిత్, బుమ్రా ఇద్దరూ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జట్టు బలం పుంజుకోనుంది. అటు ఆర్సీబీలో బౌలర్లు, బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో సమష్టిగా విజయాలు సాధిస్తోంది. రెండూ బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు గెలుపెవరిదో చూడాలి.

error: Content is protected !!