News September 27, 2024

డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్‌కు ఇబ్బంది ఏంటి?: సీఎం

image

AP: బైబిల్ చదువుతానని చెప్పిన YS జగన్‌కు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘అన్య మతస్థులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. ఎన్నో ఏళ్లుగా డిక్లరేషన్ అనేది ఉంది. CMగా ఉన్నప్పుడు ఆయన్ను ఎవరూ అడ్డుకోలేదు. అప్పుడు చేసినట్లుగా ఇప్పుడూ చేస్తానంటే ఎలా? చట్టాలు, సంప్రదాయాలను గౌరవించడంలో సీఎం మొదటి వ్యక్తిగా ఉండాలి’ అని సీఎం సూచించారు.

Similar News

News September 27, 2024

పసిఫిక్‌లో చైనా నౌక.. జపాన్ ఆందోళన

image

చైనాకు చెందిన యుద్ధవిమాన వాహక నౌక ‘లావోనింగ్’ గత ఏడు రోజులుగా పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తోందని జపాన్ రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నౌకకు అండగా మరిన్ని చైనా నౌకలు వెంట వెళ్తున్నాయని పేర్కొంది. తమకు చెందిన ఒకినొటోరీ దీవికి సుమారు 1,020 కిలోమీటర్ల దూరంలో ఆ నౌకలతో చైనా విన్యాసాలు చేయిస్తోందని ఆరోపించింది. భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ సహా పలు ఆసియా దేశాలతో చైనాకు వివాదాలున్న సంగతి తెలిసిందే.

News September 27, 2024

మూసీ బఫర్ జోన్ నిర్వాసితులకు పునరావాసం, పరిహారం: దానకిశోర్

image

TG: మూసీ రివర్ బెడ్ నిర్వాసితుల ఆందోళనల నేపథ్యంలో మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే మూసీ బఫర్‌జోన్‌లో నిర్మాణాలపై సర్వే చేస్తామని, అక్కడ పట్టాలున్న కుటుంబాలకు పునరావాసం, పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. నదీ గర్భంలో పట్టాలున్న వారు జిల్లా కలెక్టర్లను కలవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లోని విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

News September 27, 2024

లెబనాన్‌పై భీకర దాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్!

image

లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకుపోవడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ ఉత్తర సరిహద్దులో భారీగా సాయుధ వాహనాలను మోహరించింది. హెజ్బొల్లా దాడులు కొన‌సాగితే లెబ‌నాన్‌ కూడా గాజా ప‌రిస్థితే ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఇజ్రాయెల్ హెచ్చ‌రించింది. ‘హెజ్బొల్లాపై గగనతలం, సముద్రం నుంచి దాడి చేశాం. ఇప్పుడు భూదాడికి సిద్ధం కండి’ అని సైన్యానికి రక్షణ మంత్రి యోవ్ పిలుపునిచ్చారు.