News June 6, 2024

అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణమేంటి?(2/2)

image

అయోధ్యలో ఓటమికి BJP చేసిన తప్పులు కూడా ఓ కారణం. టెంపుల్ సిటీ అభివృద్ధి కోసమని స్థలాలను తీసుకున్న ప్రభుత్వం నష్టపోయినవారికి పరిహారం ఇవ్వలేదు. రామ మందిర నిర్మాణం వల్ల వ్యాపారవేత్తలు, స్థానికేతరులే లాభపడ్డారని కోపంగా ఉన్న లోకల్స్ ఓటు రూపంలో నిరసన తెలిపారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ MP లల్లూ సింగ్‌పై వ్యతిరేకత, INC ఓటు బ్యాంకు కూడా SPకి కలిసొచ్చింది.

Similar News

News January 28, 2026

‘మెగా’ ఇంటికి ట్విన్స్ రాక కోసం డేట్ ఫిక్స్?

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఈనెల 31న కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. సీమంతం సమయంలో ఇన్‌స్టా పోస్ట్‌తో తాను కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ఉపాసన <<18084618>>హింట్<<>> ఇచ్చారు. కాగా 2023 జూన్‌లో వీరికి క్లీంకార జన్మించిన విషయం తెలిసిందే. వారసుడొస్తున్నాడంటూ ఫ్యాన్స్ Xలో సందడి చేస్తున్నారు.

News January 28, 2026

వెలుతురు లేకపోవడమే ప్రధాన సమస్య: రామ్మోహన్

image

మహారాష్ట్ర విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. వెలుతురు సమస్యే కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. ల్యాండింగ్ సమయంలో సరైన వెలుతురు లేదని ఆయన వివరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని తెలిపారు. మరోవైపు కాసేపట్లో రామ్మోహన్ ఘటనాస్థలికి వెళ్లనున్నారు. MHలోని బారామతిలో ఈ ఉదయం ఫ్లైట్ క్రాషై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిచెందిన విషయం తెలిసిందే.

News January 28, 2026

మహిళా పైలట్‌పై అజిత్ పవార్ ట్వీట్.. వైరల్

image

మహారాష్ట్రలో జరిగిన <<18980548>>ప్రమాదంలో<<>> అజిత్ పవార్‌తోపాటు మహిళా పైలట్ శాంభవీ పాఠక్ మరణించడం తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు సజావుగా ల్యాండ్ అయితే.. పైలట్‌గా ఉన్నది ఓ మహిళ అని అర్థం చేసుకోవాలి’ అని 2024 జనవరి 18న ఆయన ట్వీట్ చేశారు. #NCPWomenPower అని హాష్‌ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.