News June 6, 2024
అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణమేంటి?(2/2)

అయోధ్యలో ఓటమికి BJP చేసిన తప్పులు కూడా ఓ కారణం. టెంపుల్ సిటీ అభివృద్ధి కోసమని స్థలాలను తీసుకున్న ప్రభుత్వం నష్టపోయినవారికి పరిహారం ఇవ్వలేదు. రామ మందిర నిర్మాణం వల్ల వ్యాపారవేత్తలు, స్థానికేతరులే లాభపడ్డారని కోపంగా ఉన్న లోకల్స్ ఓటు రూపంలో నిరసన తెలిపారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్లోని 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ MP లల్లూ సింగ్పై వ్యతిరేకత, INC ఓటు బ్యాంకు కూడా SPకి కలిసొచ్చింది.
Similar News
News December 22, 2025
‘SHANTI’ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

సస్టైనబుల్ హార్నెస్సింగ్ & అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో సివిల్ న్యూక్లియర్ సెక్టార్లో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న అటామిక్ ఎనర్జీ యాక్ట్-1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్-2010ను కేంద్రం రద్దు చేసింది.
News December 22, 2025
మోదీ, షాల వల్లే నక్సలిజం తగ్గింది: ఛత్తీస్గఢ్ సీఎం

AP: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నిర్ణయాల వల్లే తమ రాష్ట్రంలో నక్సలిజం చాలా వరకు తగ్గిందని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ తెలిపారు. రాజమండ్రిలో నిన్న మాజీ PM అటల్ బిహార్ వాజ్పేయీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కొన్ని దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా తమ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడక్కడా నక్సలిజం ఉందని, దాన్నీ పూర్తి స్థాయిలో రూపుమాపుతామని స్పష్టం చేశారు.
News December 22, 2025
105 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా.. సీక్రెట్ ఇదే

స్వాతంత్ర్య సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి త్వరలో 105వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. వందేళ్లకు పైగా జీవించి ఇప్పటికీ పెన్షన్ అందుకుంటున్న ఏకైక తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్న ఆయన, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తన ఆరోగ్య రహస్యం శాకాహార భోజనం, మితాహారం, నిత్య వ్యాయామమే అని చెబుతున్నారు. యువత మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు.


