News December 27, 2024
మన్మోహన్ ఆర్థిక సంస్కరణల ఫలితమిదే(1/2)

1991లో భారత ఆర్థిక వృద్ధి రేటు 3 శాతం ఉండగా, మన్మోహన్ ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది 6-7 శాతానికి చేరుకుంది. ఇది అంతర్జాతీయ రుణదాతల నమ్మకాన్ని పెంపొందించింది. ప్రపంచ బ్యాంక్, IMF నుంచి రుణ సాయం అందడంతో ఆర్థిక వ్యవస్థను నిలబడింది. భారత రూపాయిపై విశ్వసనీయత పెరిగి, దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. రెండేళ్లలోనే భారత విదేశీ నిల్వలు 1 బిలియన్ నుంచి 10 బిలియన్లకు చేరాయి.
Similar News
News February 6, 2026
సంపూర్ణ ఆహారం గొర్రెలకు అందకపోతే..

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
News February 6, 2026
రాయలసీమ లిఫ్ట్ పేరిట వైసీపీ డ్రామాలు: సీఎం

AP: కరవుతో కటకటలాడిన రాయలసీమను ఉద్యాన హబ్గా మారుస్తున్నామని సీఎం చంద్రబాబు ఎమ్మిగనూరు సభలో తెలిపారు. ఏటా 200 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉద్యాన ఉత్పత్తులు రాయలసీమ నుంచి వస్తున్నాయన్నారు. డ్రిప్ ఇరిగేషన్ సహా వివిధ రకాలుగా ఈ ప్రాంతానికి నీరిచ్చామని చెప్పారు. మచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు ఉంచుకుని రాయలసీమ లిఫ్ట్ పేరిట వైసీపీ డ్రామాలు ఆడుతోందని.. ఎలాంటి అనుమతులూ లేవని ఎన్జీటీ దానిని నిలిపేసిందన్నారు.
News February 6, 2026
పాకిస్థాన్లో పేలుడు.. 50 మంది మృతి!

పాక్ రాజధాని ఇస్లామాబాద్లోని కుబ్రా మసీదు వద్ద పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన సూసైడ్ బాంబర్ అటాక్లో 50 మంది చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు నగరంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ ఘటనకు ఇప్పటివరకు ఏ సంస్థ/వ్యక్తి బాధ్యత ప్రకటించుకోలేదు.


