News September 28, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,158 మంది భక్తులు దర్శించుకోగా 24,938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో హుండీల ద్వారా ఆదాయం రూ.3.31 కోట్లు సమకూరింది. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది.

Similar News

News December 9, 2025

మొదటి విడత ప్రచారానికి తెర

image

TG: పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరపడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత ఫలితాలు వెలువడతాయి. మొదటి విడతలో 4,235 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 56,19,430 మంది ఓటు వేయనున్నారు. వీరి కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News December 9, 2025

హనుమాన్ చాలీసా భావం – 33

image

తుమ్హరే భజన రామ కో పావై |
జన్మ జన్మ కే దుఖ బిసరావై ||
హనుమంతుడు శ్రీరాముడి పరమభక్తుడు. అందుకే ఆంజనేయస్వామిని భజిస్తే రాముడిని చేరుకోనే మార్గం సుగగమవుతుందని పండితులు చెబుతారు. హనుమాన్ భజన ఫలితంగా జన్మ జన్మలలోని దుఃఖాలన్నీ పోతాయని భావిస్తారు. మారుతీ నామ పఠనం మనకు భయాలు, దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆత్మ స్థైర్యం, ధైర్యాన్ని పెంచుతుంది. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 9, 2025

ECIపై అనుమానాలు దురదృష్టకరం: కాంగ్రెస్ MP

image

ECI తటస్థ వైఖరిపై అనుమానాలు దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి అన్నారు. CJI, లోక్‌సభలో LoP EC కమిటీలో ఉండేలా రిఫామ్స్ తేవాలని సూచించారు. వివిధ నియోజకవర్గాల్లో SIR చేపట్టడానికి కారణాలను కేంద్రం రాసివ్వాలని డిమాండ్ చేశారు. ‘EVMలు మానిప్యులేట్ అవుతాయని నేను అనడం లేదు. ఆ ఛాన్స్ ఉందని ప్రజలు భావిస్తున్నారు. 100% VVPATలను మ్యాచ్ చేయాలి లేదా బ్యాలెట్ పేపర్లకు వెళ్లాలి’ అని చెప్పారు.