News October 6, 2024
శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామి వారిని 75,552 మంది భక్తులు దర్శించుకోగా 35,885 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.54 కోట్లు సమకూరింది.
Similar News
News December 12, 2025
విశాఖలో ఐటీ పెట్టుబడులతో కొలువుల జాతర(1/2)

విశాఖ కాపులప్పాడ ఐటీ హిల్స్లో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ఇవాళ చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,583 కోట్ల పెట్టుబడిని సంస్థ పెట్టనుండగా 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇటు మధురవాడ హిల్-4లో నిర్మించనున్న సత్వా వాంటేజ్ క్యాంపస్కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారు. రూ.1500 కోట్ల పెట్టుబడితో 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా 40-50 వేల మందికి ఉపాధి లభించనుంది.
News December 12, 2025
బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి హోంమంత్రి

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన <<18539765>>బస్సు ప్రమాద<<>> స్థలానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి సంధ్యారాణి సైతం ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.
News December 12, 2025
వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ పోరాడుతోంది: పావెల్

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ తన మనుగడ కోసం పోరాడుతోందని ఆ దేశ క్రికెటర్ రోవ్మన్ పావెల్ అన్నారు. గతంలో ఆట ఎలా ఉన్నా ఇప్పుడు బాగా ఆడితే ఏ టీమ్ అయినా బాగానే కనిపిస్తుందని చెప్పారు. IPL 2026 మెగా వేలానికి ముందు KKR లాంటి ఫ్రాంచైజీ రూ.1.85 కోట్లకు తనను రిటైన్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సునీల్, రస్సెల్, బ్రావో ఉన్న టీమ్లో ఆడటం హోమ్ టీమ్లో ఆడుతున్నట్టే ఉంటుందని చెప్పారు.


