News October 6, 2024
శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా బాట గంగమ్మ ఆలయం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామి వారిని 75,552 మంది భక్తులు దర్శించుకోగా 35,885 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.54 కోట్లు సమకూరింది.
Similar News
News July 5, 2025
గిల్ మరో సెంచరీ

ENGతో రెండో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ గిల్ అదరగొడుతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్సులో భారీ డబుల్ సెంచరీ చేసిన ఈ యంగ్ సెన్సేషన్.. సెకండ్ ఇన్నింగ్సులో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 129 బంతుల్లో 100* రన్స్ చేశారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 303/4గా ఉంది. 483 పరుగుల ఆధిక్యంలో ఉంది.
News July 5, 2025
రాష్ట్రంలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు: పొంగులేటి

TG: రాష్ట్రంలో త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు 2025ను తీసుకువస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్తో చర్చించి విధి విధానాలు రూపొందించాక వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ‘మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరిస్తాం. మహిళలకు, పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం’ అని ఆయన పేర్కొన్నారు.
News July 5, 2025
శుభ్మన్ గిల్ ఆల్టైమ్ రికార్డ్

టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆల్టైమ్ రికార్డ్ బద్దలు కొట్టారు. ఒక టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా అవతరించారు. ఇంగ్లండ్తో రెండో టెస్టులో గిల్ ఫస్ట్ ఇన్నింగ్సులో 269, రెండో ఇన్నింగ్సులో 80 రన్స్ కలిపి 349* పరుగులు చేశారు. ఈ క్రమంలో సునీల్ గవాస్కర్ (344) రికార్డును ఆయన చెరిపేశారు. వీరిద్దరి తర్వాత లక్ష్మణ్ (340), గంగూలీ (330), సెహ్వాగ్ (319) ఉన్నారు.