News September 23, 2024
అమెరికా పంపే డ్రోన్లతో ఉపయోగాలేంటి?

అమెరికా నుంచి భారత్ <<14173073>>సమకూర్చుకోనున్న<<>> 31 MQ- 9B ప్రిడేటర్ డ్రోన్లు దేశ సరిహద్దు భద్రతను మరింత పటిష్ఠం చేయనున్నాయి. చైనా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో 16 గగనతల, 15 సముద్రతీర రక్షణ డ్రోన్లను మోహరించనున్నారు. ఈ డ్రోన్లు 35 గంటలపాటు ఏకధాటిగా గాల్లో ఉండగలవు. 50,000 అడుగుల ఎత్తులో 442 km/h అత్యధిక వేగంతో ఎగురగలవు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో 1,700 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలవు.
Similar News
News November 25, 2025
అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News November 25, 2025
ఓవర్ కాన్ఫిడెన్స్తోనే ఐబొమ్మ రవి దొరికాడు: పోలీసులు

TG: ఐబొమ్మ రవికి కష్టపడి జాబ్ చేయాలన్న ఆలోచన లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ CP శ్రీనివాస్ వెల్లడించారు. ‘టెక్నాలజీ తెలుసు. ఈజీ మనీ కోసం సినిమాలను పైరసీ చేశాడు. ఓవర్ కాన్ఫిడెన్స్తోనే రవి దొరికాడు. అతడి భార్య మాకు సమాచారం ఇచ్చిందనేది అవాస్తవం. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రూ.20 కోట్ల వరకు సంపాదించాడు. మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పలు పైరసీ సైట్ల నిర్వాహకులను పట్టుకుంటాం’ అని స్పష్టం చేశారు.
News November 25, 2025
హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి: సిద్దరామయ్య

CM మార్పు విషయంలో గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీకి వెళ్లే స్వేచ్ఛ ఎమ్మెల్యేలకు ఉందని, వారు తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని అన్నారు. అధిష్ఠానం నుంచి సిగ్నల్ రాగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు తాను పార్టీ నుంచి ఏమీ డిమాండ్ చేయడం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు.


