News May 13, 2024
ఉదయం 9 గంటలకు ఓటింగ్ పర్సెంట్ ఎంతంటే?

దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్సభ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.35 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ పేర్కొంది. ఏపీలో 9.21 శాతం, తెలంగాణలో 9.51 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఇదే సమయానికి ఏపీలో 10శాతం ఓటింగ్ నమోదవడం గమనార్హం. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు.
Similar News
News February 1, 2026
IISER తిరుపతిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

AP: తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ <
News February 1, 2026
మాఘ పౌర్ణమి: అద్భుత ఫలితాలనిచ్చే పుణ్యకార్యాలు

నేడు చేసే చిన్న సత్కార్యం కూడా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. ఈరోజు గంగమ్మను, నారాయణుడిని స్మరిస్తూ పితృ తర్పణాలు వదలడం శుభప్రదం. దానధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే, సాయంత్రం వేళ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర దినాన చేసే జప, హోమాలు సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాయి.
News February 1, 2026
ప్రెగ్నెన్సీలో ఎంతసేపు పడుకోవాలంటే?

ప్రెగ్నెన్సీలో తల్లికి 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. అలాగే పడుకోవడానికి వీలుగా పిల్లో వాడాలని సూచిస్తున్నారు. మంచి నిద్ర కోసం మసాలాలున్న ఆహారాలు, కెఫీన్ వంటివి తగ్గించాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రకు ముందు చూడకపోవడమే మంచిది. కనీసం ఒక గంట ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల గర్భాశయానికి తగినంత రక్తం, పోషకాలు అందుతాయని చెబుతున్నారు.


