News October 20, 2024
ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ?: జగన్

AP: కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమే బద్వేల్ ఘటనకు కారణమని ఆరోపించారు. నిత్యం ఏదోచోట అత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని, ఇదేమి రాజ్యం చంద్రబాబు గారూ అని ప్రశ్నించారు. తాము తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని, ఇప్పుడు దాని ప్రాధాన్యం తెలుస్తోందని జగన్ అన్నారు.
Similar News
News January 3, 2026
నవగ్రహాలను దర్శించుకొని కాళ్లు కడగకూడదా?

అలా కడగకూడదని పండితులు చెబుతుంటారు. అలా కడిగితే గ్రహాల శక్తి తరంగాలు మనపై చూపించే సానుకూల ప్రభావం, పుణ్యఫలం తగ్గిపోతుందని అంటారు. అయితే ఆలయం నుంచి ఇంటికి వెళ్లి, కొద్ది సమయం తర్వాత కడుక్కోవచ్చట. నవగ్రహాల ప్రదక్షిణలు ముగించి, కాసేపు అక్కడ కూర్చుని, ఆ గ్రహాల అనుగ్రహాన్ని స్మరించుకుని బయటకు రావాలట. ప్రదక్షిణ చేసిన వెంటనే కాళ్లు కడగడం వల్ల దోష నివారణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని భక్తుల నమ్మకం.
News January 3, 2026
‘ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అంటే ఎట్లా?: జైశంకర్

పాక్తో సింధూ జలాల ఒప్పందం నిలిపేవేతపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘‘పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. మీరు సరైన నైబర్గా లేకపోతే ఓ మంచి పొరుగు దేశం నుంచి ప్రయోజనాలు పొందలేరు. ‘మీపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అని అడిగితే ఎట్లా?’’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు ఇండియాకు ఉందని, ఆ హక్కును ఎలా ఉపయోగించుకోవాలో ఎవరూ నిర్దేశించలేరని స్పష్టంచేశారు.
News January 3, 2026
ధనుర్మాసం: పంతొమ్మిదో రోజు కీర్తన

హంస తూలికా తల్పంపై పవళించిన స్వామిని మాట్లాడమని వేడుకుంటున్నారు. కృష్ణుడిని క్షణ కాలం కూడా విడవలేని నీళాదేవిని ఉద్దేశించి ‘తల్లీ! నీ నిరంతర సాన్నిధ్యం నీ స్వభావానికి తగినదే! కానీ, మమ్మల్ని కూడా కరుణించి స్వామి సేవలో పాల్గొనే అవకాశమివ్వు’ అని అడుగుతున్నారు. జగన్మాత అయిన నీళాదేవి అనుమతి వస్తేనే తమ ధనుర్మాస వ్రతం సఫలమై, భగవత్ కైంకర్యం సిద్ధిస్తుందని గోదాదేవి ఆర్తితో విన్నవిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>


