News September 16, 2024
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి

TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
Similar News
News December 18, 2025
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ.25వేలు: గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లిన వారిని ‘రాహ్వీర్’(హీరో ఆఫ్ ది రోడ్)గా గుర్తించి ₹25వేలు రివార్డు ఇస్తామని వెల్లడించారు. పోలీసులు, లీగల్ భయాలు లేకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో సాయం అందిస్తే ఏటా దాదాపు 50వేల మందిని కాపాడవచ్చని చెప్పారు. బాధితులకు ఏడు రోజుల చికిత్సకు ₹1.5 లక్షలు ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు.
News December 18, 2025
కాంగ్రెస్, ఇండీ కూటమి MPల తీరు అభ్యంతరకరం: కేంద్ర మంత్రి

<<18603186>>లోక్సభలో<<>> కాంగ్రెస్, ఇండీ కూటమి ఎంపీలు ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా వ్యవహరించారని కేంద్ర మంత్రి శివ్రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ‘బల్లలపైకి ఎక్కి, పేపర్లు చించేసి అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారి తీరును ఖండిస్తున్నాను. పేదల సంక్షేమమే BJP సంకల్పం. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. అందుకే 25 కోట్ల మంది దారిద్ర్యరేఖ నుంచి బయటపడ్డారు’ అని చెప్పారు.
News December 18, 2025
స్పీకర్ నిర్ణయంపై మేము స్పందించం: రేవంత్

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో <<18592868>>స్పీకర్<<>> నిర్ణయంపై పార్టీ పరంగా తాము స్పందించబోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొంత ఎమ్మెల్యేలు తమ పార్టీలో లేరని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో బీఆర్ఎస్ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే న్యాయస్థానాలకు వెళ్లవచ్చని తెలిపారు. అటు ప్రతిపక్షాలకు ఇంకా అహం తగ్గలేదని, 2029 ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.


