News September 16, 2024

రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి

image

TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.

Similar News

News December 24, 2025

‘యూరియా’ యాప్ సక్సెస్: మంత్రి

image

TG: రైతులు ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకునేలా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విజయవంతంగా అమలవుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ADB, జనగామ, MBNR, NLG, PDPL జిల్లాల్లో ఈ యాప్ అమలవుతుండగా ఇప్పటివరకు 60,000+ బస్తాలు బుక్ అయినట్లు తెలిపారు. యాప్‌ను మరికొన్ని రోజులు పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే 5.30లక్షల టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చిందని చెప్పారు.

News December 24, 2025

చిన్న సినిమాల హవా.. రేపు థియేటర్లలోకి మరిన్ని!

image

బాక్సాఫీసు వద్ద ఇటీవల పలు చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. రేపు నాలుగైదు చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఆది సాయి కుమార్ ‘శంబాల’, శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’, శివాజీ, నవదీప్ నటించిన ‘దండోరా’, హారర్ ఫిల్మ్ ‘ఈషా’, యూత్ ఫుల్ మూవీ ‘పతంగ్’ వంటివి ఈ లిస్టులో ఉన్నాయి. వీటితో పాటు ‘వృషభ’, ‘మార్క్’ లాంటి డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. వీటిలో మీరు దేనికి వెళ్తున్నారు?

News December 24, 2025

పళ్ల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

image

పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే పాలు, పెరుగు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటినుంచి దంతాలకు కావాల్సిన క్యాల్షియం, ఫాస్ఫరస్ అందుతాయి. పాలకూర, తోటకూర తినడం వల్ల విటమిన్ A, C, ఫోలేట్ అందుతాయి. ఆపిల్స్, క్యారట్స్, నారింజ, మామిడి, ఉసిరికాయలు, చేపలు, గుడ్లు తినాలి. తీపి పదార్థాలు, చిప్స్, స్పైసీ ఫుడ్స్ తినడం తగ్గించాలంటున్నారు. పంటి ఆరోగ్యం బావుంటే మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.