News September 16, 2024
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి

TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
Similar News
News December 11, 2025
1950+ విమానాలను నడుపుతున్నాం: ఇండిగో

ఇవాళ 1,950కి పైగా విమానాలను నడుపుతున్నట్లు ఇండిగో ప్రకటించింది. 138 గమ్యస్థానాలకు దాదాపు 3 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని తెలిపింది. నెట్వర్క్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొంది. డిసెంబర్ 8 నుంచి ఇండిగోలో నెట్వర్క్ సమస్యలు తలెత్తి వందలాది ఫ్లైట్లు రద్దయిన విషయం తెలిసిందే.
News December 11, 2025
హనుమాన్ చాలీసా భావం – 35

ఔర దేవతా చిత్త న ధరయీ|
హనుమత సేయి సర్వ సుఖ కరయీ||
మహాబలశాలి, చిరంజీవి అయిన హనుమంతుడిని నిరంతరం తలచుకోవడం ద్వారా మనం అన్ని కష్టాలు, భయాల నుంచి విముక్తి పొంది, సకల సౌఖ్యాలను పొందుతాము. ఆంజనేయ స్వామిని నమ్మిన వారికి సర్వదా విజయమే కలుగుతుంది. ఆయనను భక్తితో ఆరాధించిన వారికి అన్ని రకాల సుఖాలు, సంతోషాలు, శుభాలు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 11, 2025
వేసవి కరెంటు కష్టాలు గట్టెక్కించేలా ‘యాదాద్రి’

TG: వేసవిలో విద్యుత్ డిమాండ్కు తగ్గ ముందస్తు ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టింది. 2026 FEB నాటికి ఉత్పత్తి జరిగేలా 4000 MW ‘యాదాద్రి’ ప్లాంటును సిద్ధం చేస్తోంది. అప్పటికల్లా GENCO దీని సింక్రనైజేషన్ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఉత్పత్తి ప్రారంభమైతే బయటినుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన భారం తప్పుతుంది. వేసవిలో గరిష్ఠ విద్యుత్ వినియోగం 17,500 MWగా ఉండగా ఈసారి 18000 MWకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.


