News September 16, 2024
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి

TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
Similar News
News December 28, 2025
జెప్టో.. రూ.11 వేల కోట్లకు IPO

క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి డాక్యుమెంట్లు సమర్పించింది. ఈ IPO ద్వారా సుమారు రూ.11వేల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2026లో మార్కెట్లో లిస్టింగ్ కావాలని భావిస్తోంది. కాగా 2020లో అదిత్, కైవల్య ఈ స్టార్టప్ను ప్రారంభించారు. ప్రస్తుతం దీని విలువ 7 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే దీని పోటీదారులైన స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్ (జొమాటో) లిస్ట్ అయ్యాయి.
News December 28, 2025
కేజీ చికెన్ రూ.300.. మాంసం ప్రియులకు షాక్

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ రూ.300గా ఉంది. విజయవాడలో కేజీ రూ.280, వరంగల్లో రూ.290, గుంటూరులో రూ.260, శ్రీకాకుళంలో రూ.305కి విక్రయిస్తున్నారు. గత వారం HYDలో కేజీ రూ.250 ఉండగా ఇప్పుడు రూ.50 వరకు పెరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అటు కోడిగుడ్డు ధర రూ.8గా ఉంది.
News December 28, 2025
డిగ్రీ అర్హతతో 451 పోస్టులు.. అప్లై చేశారా?

త్రివిధ దళాల్లో 451 ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. CDSE-2026 ద్వారా UPSC వీటిని భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణులై, 20 -24ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.200. SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: upsconline.nic.in. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


