News September 16, 2024

రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి

image

TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.

Similar News

News December 29, 2025

మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతున్నారా?

image

AP: చాలా మంది దోమల నుంచి రక్షణకు మస్కిటో కాయిల్ పెట్టి నిద్రపోతుంటారు. అయితే దీనివలన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి ఇంట్లో నిద్రపోతుండగా మస్కిటో కాయిల్ దుప్పటికి అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిర్లక్ష్యం చేయకుండా నిద్రకు ముందు కాయిల్ ఆర్పివేయడం లేదా బెడ్‌కు దూరంగా ఉంచుకోవాలి.

News December 29, 2025

కశ్మీర్‌లో బౌద్ధం: ఫ్రాన్స్ మ్యూజియం ఫొటోల్లో 2000 ఏళ్ల చరిత్ర

image

ఫ్రాన్స్ మ్యూజియంలోని కొన్ని పాత ఫొటోలు కశ్మీర్ 2000 ఏళ్ల నాటి బౌద్ధ చరిత్రను వెలుగులోకి తెచ్చాయి. జెహన్‌పొరాలో జరిగిన తవ్వకాల్లో పురాతన బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ సంస్కృతికి కేంద్రంగా ఉండేదని ప్రధాని మోదీ తాజా ‘మన్ కీ బాత్‌’లో చెప్పారు. ఒకప్పుడు సిల్క్ రూట్ ద్వారా కంధార్ వరకు విస్తరించిన బౌద్ధ నెట్‌వర్క్‌లో కశ్మీర్ కీలక పాత్ర పోషించిందని ఈ ఆధారాలు నిరూపిస్తున్నాయి.

News December 29, 2025

సైన్యంలో అవినీతి.. టాప్ జనరల్స్‌పై వేటు వేసిన జిన్‌పింగ్

image

చైనా సైన్యంలో అగ్రశ్రేణి అధికారులే అవినీతికి పాల్పడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తాజాగా ముగ్గురు కీలక సైనిక అధికారులపై పార్లమెంట్ బహిష్కరణ వేటు వేసింది. సెంట్రల్ మిలిటరీ కమిషన్ విభాగాల అధిపతులు వాంగ్ రెన్‌హువా, వాంగ్ పెంగ్‌తో పాటు ఆర్మ్‌డ్ పోలీస్ అధికారి జాంగ్ హాంగ్‌బింగ్‌ను పదవుల నుంచి తొలగించారు. సైన్యంలో ప్రక్షాళనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.