News March 29, 2024
ఏ సంచలనం నమోదు చేస్తారో?

ఇవాళ RCB, కేకేఆర్ మధ్య బెంగళూరు చిన్నస్వామి వేదికగా మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచుల గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. IPLలోనే అత్యంత తక్కువ పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ(49) KKRపై చెత్త రికార్డును మూటగట్టుకుంది. మరోవైపు సొంత మైదానంలో KKRపై 2015 తర్వాత విజయం సాధించలేకపోయింది. మరి ఈ మ్యాచులో గెలిచి పరాజయాలకు బ్రేక్ వేస్తుందో లేదో చూడాలి.
Similar News
News March 21, 2026
సంగారెడ్డి: రోగుల వివరాలు ఇక డిజిటల్ రూపంలో..

రోగుల పూర్తి వైద్య వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాలలో జరిగిన శిక్షణ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టు కింద జోగిపేట, పటాన్చెరు, సదాశివపేట ఏరియా ఆసుపత్రులతో పాటు 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల డిజిటల్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని తెలిపారు.
News March 21, 2026
నేడు, రేపు వర్షాలు: APSDMA

AP: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరం, VZG, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News March 21, 2026
గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

దేశవ్యాప్తంగా పానిక్ బుకింగ్స్ తగ్గాయని కేంద్రం తెలిపింది. అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని చెప్పింది. ‘గ్యాస్ బుకింగ్స్ 89 లక్షల నుంచి 55 లక్షలకు తగ్గాయి. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటల్లో 4 వేల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. కొత్తగా 13,700 PNG కనెక్షన్లు జారీ చేశాం. ప్రజలు PNG, ఎలక్ట్రిక్/ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మళ్లాలి’ అని సూచించింది.


