News October 29, 2025

వరి పంట.. గింజ గట్టిపడే దశలో ఉంటే ఏం చేయాలి?

image

గింజ గట్టిపడే దశలో వరి పంట ఉంటే.. ముందుగా పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. గింజలో నిద్రావస్థ తొలగి నిలబడి ఉన్న. పడిపోయిన చేలలో మొలక వచ్చే అవకాశం ఉంది. కోత దశలో లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనబడితే, 5% ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లు ఉప్పును లీటరు నీటికి కలపాలి) కలిపి పిచికారీ చేస్తే మొలకెత్తడాన్ని, రంగు మారడాన్ని నివారించవచ్చని ఏపీ వ్యవసాయశాఖ తెలిపింది.

Similar News

News October 29, 2025

భరత్ పోరాటం వృథా.. ఓడిన తెలుగు టైటాన్స్

image

PKL సీజన్-12లో పుణేరి పల్టాన్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచులో తెలుగు టైటాన్స్ 45-50 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఫస్టాఫ్‌లో టైటాన్స్ ఆధిక్యంలో నిలిచినా సెకండాఫ్‌లో పుణేరి పుంజుకుంది. భరత్ 23 పాయింట్లతో ఒంటరి పోరాటం చేసినా TT డిఫెండర్లు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించలేకపోయారు. ఓటమితో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణే ఫైనల్ చేరింది. ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో అమీతుమీ తేల్చుకోనుంది.

News October 29, 2025

ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ప్రభుత్వం ఆదేశం

image

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే ప్రైవేట్ కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. కాలేజీల్లో సౌకర్యాలు, విద్యార్థుల నమోదుపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. పోలీస్, విద్యాశాఖ సహకారంతో ఈ తనిఖీలు చేపట్టనుంది. మరోవైపు బకాయిలు చెల్లించాకే తనిఖీలు చేయాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.

News October 29, 2025

సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ₹10 కోట్లు

image

AP: సత్యసాయి శతజయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇతర ఏర్పాట్లకోసం ₹10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. NOV 23న పుట్టపర్తిలో దీన్ని నిర్వహిస్తారు. కాగా దీనిపై దాఖలైన PILను హైకోర్టు విచారించింది. పలు సేవలందించిన వారిని స్మరించుకోవడంలో తప్పులేదంది. పిల్‌ను వెనక్కు తీసుకోవాలని సూచించడంతో పిటిషనర్ ఉపసంహరించుకున్నారు.