News July 11, 2024
విద్యార్థుల ఆత్మహత్యలను అరికట్టడానికి ఏం చేశారు?: సుప్రీంకోర్టు

విద్యార్థుల ఆత్మహత్యల అంశం సామాజిక సమస్యగా మారిందని, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని CJI జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. సూసైడ్లను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలంటూ గౌరవ్ బన్సల్ అనే లాయర్ దాఖలు చేసిన పిల్పై సుప్రీం స్పందించింది. కాగా 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు.
Similar News
News November 28, 2025
HYD: రోలెక్స్ వాచీ కాజేసిన కానిస్టేబుల్

నకిలీ IPS శశికాంత్ను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు షేక్ పేటలోని అపర్ణ ఔరా అపార్ట్ మెంట్కు వెళ్లి తాళం తీసి వీడియోగ్రఫీ మధ్య సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో పోలీసులతో ఉన్న ఓ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్ రోబ్లో ఉన్న రోలెక్స్ వాచ్పై పడింది. వీడియోకు చిక్కకుండా వాచీని చేజిక్కించుకోగలిగినా మరో కానిస్టేబుల్ కంట పడ్డాడు. దీంతో అతడు మరికొన్ని వస్తువులు కాజేశాడు.
News November 28, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 28, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అప్రెంటిస్ పోస్టులు

హైదరాబాద్-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


