News October 24, 2025
భారత్ ఓటమికి కారణాలివే?

నిన్న AUS చేతిలో టీమ్ ఇండియా ఓటమికి ప్రధాన కారణం మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ను ఆడించకపోవడమేనని తెలుస్తోంది. మిడిల్ ఓవర్లలో మన బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. అటు ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ జంపా 4 వికెట్లతో సత్తా చాటారు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ నితీశ్ కాకుండా సుందర్ ముందుగా రావడమూ ఓ కారణంగా కనిపిస్తోంది. కోచ్ గంభీర్ నిర్ణయాలతో పాటు కొత్త కెప్టెన్ గిల్ అనుభవలేమి కనిపిస్తోంది. మీ కామెంట్?
Similar News
News October 24, 2025
న్యూస్ అప్డేట్స్

➤ J&Kలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రిలీజ్. 3 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, క్రాస్ ఓటింగ్తో ఒక స్థానంలో BJP గెలుపు
➤ బిహార్లో BJP-JDU కూటమి CM అభ్యర్థి నితీశ్ కుమార్ అని స్పష్టం చేసిన PM మోదీ.
➤ AP: తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం.
➤ TG: జూబ్లీహిల్స్ తుది ఓటర్ లిస్ట్ రిలీజ్. మొత్తం 4,01,365 మంది ఓటర్లు.
News October 24, 2025
పవన్ కళ్యాణ్తో హైడ్రా రంగనాథ్ భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలంగాణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం అయ్యారు. మంగళగిరి క్యాంప్ ఆఫీస్లో ఈ భేటీ జరిగింది. సుమారు రెండు గంటల పాటు వారిద్దరూ పలు అంశాలపై మాట్లాడుకున్నారు. భేటీకి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News October 24, 2025
సర్వీసు ఇనాం భూములకు త్వరలోనే పరిష్కారం: అనగాని

AP: సర్వీసు ఇనాం భూముల సమస్యల పరిష్కారానికి దేవాదాయశాఖ అధికారులు, తహశీల్దార్లతో కమిటీలు వేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 45 రోజుల్లో నివేదిక ఇస్తారని, దానిపై CMతో చర్చించి పరిష్కారం చూపిస్తామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై GOM సమావేశం జరగ్గా అనగానితో పాటు నారాయణ, పయ్యావుల, ఫరూక్ పాల్గొన్నారు. పరిశ్రమలు, ఇతర భూముల కేటాయింపుపై సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.


