News April 18, 2024
PV, మన్మోహన్ తెచ్చిన సంస్కరణలు ఏంటి?1/2

సుప్రీంకోర్టులో తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా PV నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. 1991లో ప్రధాని PV నేతృత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని కొనియాడింది.
➯1991 నాటికి దేశంలో ప్రతీ నిర్ణయం GOVT చేతుల్లోనే ఉండేది. లైసెన్స్ రాజ్ అనే ఈ విధానాన్ని PV ప్రభుత్వం రద్దు చేసింది.
Similar News
News November 24, 2025
ఇది సరిగా ఉంటే ఆరోగ్యం మీ వెంటే..

మనిషి జీవనశైలిని నియంత్రించేది జీవ గడియారం. అంటే బయోలాజికల్ క్లాక్. రోజువారీ జీవితంలో నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, జీవరసాయన ప్రక్రియలు సమయానికి జరిగేలా చూస్తుంది. అయితే దీంట్లో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. శారీరకంగా, మానసికంగా క్రమంగా శక్తిహీనులుగా మారిపోతుంటే అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News November 24, 2025
భారీగా పెరిగిన కూరగాయల ధరలు!

TG: కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లు, వారాంతపు సంతల్లో ఏ కూరగాయ అయినా కేజీ రూ.80 నుంచి రూ.120 పలుకుతోంది. తోటకూర కిలో రూ.90 వరకు అమ్ముతుండగా, పాలకూర రేటు రూ.160కి చేరింది. బీర, బెండ, కాకర, క్యాప్సికం, చిక్కుడు, వంకాయ రేట్లు గత 2 నెలలతో పోలిస్తే డబుల్ అయ్యాయి. తుఫాన్ ప్రభావంతో పంట నష్టం, దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
News November 24, 2025
నేటి నుంచి ‘రైతన్నా.. మీకోసం’

AP: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నేటి నుంచి వారం పాటు ‘రైతన్నా.. మీకోసం’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా CM CBNతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్తారు. రైతుల కోసం ప్రభుత్వం ఏం చేసింది? ఏం చేయబోతోంది? అనేది వివరిస్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, ఫుడ్ ప్రాసెసింగ్పై అవగాహన కల్పిస్తారు.


