News April 18, 2024
PV, మన్మోహన్ తెచ్చిన సంస్కరణలు ఏంటి?1/2

సుప్రీంకోర్టులో తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా PV నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. 1991లో ప్రధాని PV నేతృత్వంలో ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని కొనియాడింది.
➯1991 నాటికి దేశంలో ప్రతీ నిర్ణయం GOVT చేతుల్లోనే ఉండేది. లైసెన్స్ రాజ్ అనే ఈ విధానాన్ని PV ప్రభుత్వం రద్దు చేసింది.
Similar News
News December 22, 2025
మోదీ, షాల వల్లే నక్సలిజం తగ్గింది: ఛత్తీస్గఢ్ సీఎం

AP: ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల నిర్ణయాల వల్లే తమ రాష్ట్రంలో నక్సలిజం చాలా వరకు తగ్గిందని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ తెలిపారు. రాజమండ్రిలో నిన్న మాజీ PM అటల్ బిహార్ వాజ్పేయీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కొన్ని దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా తమ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడక్కడా నక్సలిజం ఉందని, దాన్నీ పూర్తి స్థాయిలో రూపుమాపుతామని స్పష్టం చేశారు.
News December 22, 2025
105 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా.. సీక్రెట్ ఇదే

స్వాతంత్ర్య సమరయోధుడు, రెవెన్యూ శాఖ మాజీ ఉద్యోగి ఏటుకూరి కృష్ణమూర్తి త్వరలో 105వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. వందేళ్లకు పైగా జీవించి ఇప్పటికీ పెన్షన్ అందుకుంటున్న ఏకైక తెలుగు వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్న ఆయన, ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. తన ఆరోగ్య రహస్యం శాకాహార భోజనం, మితాహారం, నిత్య వ్యాయామమే అని చెబుతున్నారు. యువత మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు.
News December 22, 2025
ప్రభాకర్ రావును విచారించనున్న సజ్జనార్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కస్టోడియల్ విచారణలో ఉన్న ప్రభాకర్ రావును విచారించేందుకు CP సజ్జనార్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ముందుగా ఛార్జిషీట్ వేసి తర్వాత కేసుతో సంబంధం ఉన్న వారందరినీ విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులను ACP, DCP, జాయింట్ సీపీ స్థాయి అధికారులే విచారించారు. కమిషనర్ స్థాయిలో ఉన్న సజ్జనార్ నిందితుడిని విచారించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.


