News April 8, 2025

భవిష్యత్తులో ఏం జరుగుతుందో.. దేవుడికే తెలియాలి: థరూర్

image

భారత్‌పై US విధించిన ఆంక్షల పట్ల కాంగ్రెస్ MP శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేంద్రం వెంటనే అమెరికాతో చర్చలు ప్రారంభించి ఈ సంక్షోభానికి తెరదించాలి. కొన్ని దేశాలు మాంద్యంలోకి వెళ్లిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మరీ ఇబ్బంది ఉండకపోవచ్చు. చర్చల తర్వాత భారత్‌కు సుంకాల నుంచి ఊరట లభిస్తుందేమో చూడాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుడికే తెలియాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News April 8, 2025

APSRTC 750 ఎలక్ట్రిక్ బస్సులు

image

APకి కేంద్రం శుభవార్త అందించింది. ‘PM ఈ-బస్ సేవా’ కింద తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. విజయవాడ, GNT, VSKP, కాకినాడ, రాజమండ్రి, NLR, తిరుపతి, కర్నూలు, అనంతపురం, మంగళగిరి, కడప నగరాల్లో వీటిని తిప్పనుంది. PPP పద్ధతిలో 10వేల బస్సులను రాష్ట్రాలకు కేంద్రం ఇస్తుండగా, ఏపీకి 750 కేటాయించింది. త్వరలోనే ఏ డిపోకు ఎన్ని కేటాయించాలనే దానిపై వివరాలను అధికారులు వెల్లడించనున్నారు.

News April 8, 2025

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్స్

image

నిన్న భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1089 పాయింట్ల లాభంతో 74,227, నిఫ్టీ 282 పాయింట్లు పొంది 22,444 వద్ద మొదలయ్యాయి. HUL, ట్రెంట్, టాటా స్టీల్, హిందాల్కో, శ్రీరామ్ ఫైనాన్స్ లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ ప్రభావం నుంచి భారత్ సహా వివిధ దేశాల స్టాక్స్ స్వల్పంగా కోలుకుంటున్నాయి.

News April 8, 2025

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ప్రీరిలీజ్‌కు NTR

image

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా 12వ తేదీన ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, ఈ చిత్రంలో విజయశాంతి తల్లి పాత్రలో నటిస్తున్నారు.

error: Content is protected !!