News March 15, 2025

కొత్త కెప్టెన్లు.. ఏం చేస్తారో?

image

ఐపీఎల్ 2025లో అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారయ్యారు. కొత్తగా పంజాబ్‌కు శ్రేయస్, KKRకు రహానే, లక్నోకు పంత్, ఢిల్లీకి అక్షర్, ఆర్సీబీకి రజత్ పాటీదార్‌ను సారథులుగా నియమించారు. ఇందులో KKR మినహా మిగతా జట్లకు ఇప్పటివరకు ఒక్క కప్పు రాలేదు. గత సీజన్‌లో కోల్‌కతా‌ను విన్నర్‌గా నిలిపిన అయ్యర్ ఈ సారి పంజాబ్‌తో చేరడం ఆసక్తికరంగా మారింది. మరి కొత్త కెప్టెన్ల రాకతోనైనా ఆయా జట్ల దశ మారుతుందో చూడాలి. మీ కామెంట్?

Similar News

News March 15, 2025

అలాంటి పాత్రలు చేయాలనేది నా కోరిక: శివాజీ

image

ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య వంటి నటుల్లా మరుపురాని పాత్రలు చేయాలని ఉండేదని నటుడు శివాజీ అన్నారు. క్రూరమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనేది తన కోరిక అని చెప్పారు. కోర్టు సినిమాలో తన పాత్రకు వస్తున్న ఆదరణ ఆనందాన్ని ఇస్తోందన్నారు. షూటింగ్ సెట్‌లో నా అరుపులకు అంతా భయపడేవారని తెలిపారు. ప్రస్తుతం లయతో ఓ సినిమాతో పాటు ‘దండోరా’ అనే మరో చిత్రంలో చేస్తున్నట్లు వెల్లడించారు.

News March 15, 2025

WPL: ఫైనల్ విజేత ఎవరో?

image

నేడు WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఢిల్లీ, రెండో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ముంబై ఉవ్విళ్లూరుతున్నాయి. ఆల్‌రౌండర్లు నాట్ సీవర్, హేలీ మాథ్యూస్‌లతో ముంబై టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ సీజన్‌లో ముంబైపై ఢిల్లీదే ఆధిపత్యం. కాగా మ్యాచ్ రా.8.00 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లలో లైవ్ చూడవచ్చు.

News March 15, 2025

ఏపీఈఏపీ సెట్‌కు దరఖాస్తులు ప్రారంభం

image

ఏపీఈఏపీ సెట్ 2025కు శనివారం నుంచి ఏప్రిల్ 24వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఛైర్మన్ ప్రసాద్ ప్రకటించారు. అపరాధ రుసుము రూ10,000 చెల్లింపుతో మే16 వరకూ అప్లై చేసుకోవచ్చన్నారు. మే19-27 వరకూ ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. JNTU వర్సిటీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

error: Content is protected !!