News July 22, 2024

‘నీట్’పై పార్లమెంట్‌లో వాడీవేడీ చర్చ

image

నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్‌లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడ్డ ఈ వ్యవహారంపై కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోందని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయితే నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. నీట్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని సమాధానం ఇచ్చారు.

Similar News

News October 22, 2025

వరల్డ్ క్లాస్ లైబ్రరీ కోసం శోభా గ్రూప్ ₹100 కోట్ల విరాళం

image

AP: ప్రపంచ అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని CM CBN పేర్కొన్నారు. దుబాయ్‌ పర్యటనలో ఆయనతో పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీకి ‘శోభా గ్రూప్’ ఛైర్మన్ మీనన్ ₹100 కోట్ల విరాళం ప్రకటించారు. రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని సీఎం ఆ సంస్థను కోరారు. అంతకు ముందు APలో పెట్టుబడులకు అవకాశాలపై భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో చర్చించారు.

News October 22, 2025

నకిలీ మద్యం కేసు: 7 రోజుల పోలీస్ కస్టడీ!

image

AP: నకిలీ మద్యం కేసు నిందితులను 7 రోజుల పోలీస్ కస్టడీకి VJA కోర్టు అనుమతి ఇచ్చింది. విజయవాడ జైలులో ఉన్న A2 జగన్ మోహన్‌రావును రేపు, నెల్లూరు జైలులో ఉన్న A1 జనార్దన్‌రావును ఎల్లుండి కస్టడీలోకి తీసుకోనున్నారు. A13 తిరుమలశెట్టి శ్రీనివాస్‌నూ కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ దాఖలు చేయగా విచారణ రేపటికి వాయిదా పడింది. అటు జనార్దన్‌రావు బెయిల్ పిటిషన్‌పై విచారణ కూడా కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.

News October 22, 2025

బిగ్ ట్విస్ట్.. హోల్డ్‌లో నవీన్ యాదవ్ నామినేషన్‌!

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్‌పై ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన నామినేషన్‌కు రిటర్నింగ్ అధికారి ఇంకా ఆమోదం తెలపలేదు. ఫామ్-26 తొలి 3 పేజీల కాలమ్స్‌ విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాటిని ఆర్వో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈక్రమంలోనే మళ్లీ పిలుస్తామని, వెయిట్ చేయాలని నవీన్‌కు సూచించారు. దీంతో INC శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.