News June 19, 2024
MP, MLAగా కొనసాగితే తప్పేంటి?: RLP నేత

ఒకే సమయంలో MP, MLAగా కొనసాగితే తప్పేంటని RLP నేత హనుమాన్ బేనీవాల్ అన్నారు. అమెరికాలో ఇలాంటి నిబంధన ఉందని, మనదేశంలో కూడా ఉంటే బాగుంటుందన్నారు. ‘రెండు పదవుల్లో కొనసాగితే నష్టమేంటి? ప్రజలే కదా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీగా ఎన్నికై రెండు సభల్లో కొనసాగే నిబంధన ఉండాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా మన దేశంలో MLAగా, MPగా ఒకేసారి ఉభయ సభల్లో సభ్యుడిగా ఉండేందుకు వీలు లేదు.
Similar News
News December 11, 2025
పంచాయతీ ఎన్నికలు.. అత్యధిక పోలింగ్ ఎక్కడంటే?

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియగా కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే రాష్ట్రంలో అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 87.93 శాతం పోలింగ్ నమోదైంది. తర్వాతి స్థానాల్లో సూర్యాపేట(87.77%), మెదక్(86%), నల్గొండ(81.63%), వరంగల్(81.2%), నిర్మల్(79.81%), మంచిర్యాల(77.34%), హన్మకొండ(75.6%), ములుగు(73.57%), జనగాం(71.96%), ఆదిలాబాద్(69.10%) జిల్లాలున్నాయి.
News December 11, 2025
భారతీయులను పంపించడం సిగ్గుచేటు: ట్రంప్

అమెరికాలో టాప్ యూనివర్సిటీల్లో చదువు పూర్తిచేసుకున్న టాలెంటెడ్ ఇండియన్స్ దేశం విడిచి వెళ్లాల్సి వస్తోందని, ఇది సిగ్గుచేటని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా ఆయన కొత్త “<<18530951>>ట్రంప్ గోల్డ్ కార్డ్<<>>”ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మాట్లాడిన ఆయన హైస్కిల్డ్ స్టూడెంట్స్కు ఉద్యోగం ఇచ్చి వారిని అమెరికాలోనే నిలుపుకోవడానికి ఇది కీలకమన్నారు. కంపెనీలు ఈ కార్డ్ కొనుగోలు చేయొచ్చని వివరించారు.
News December 11, 2025
పత్తి రైతులను కేంద్రం ఆదుకోవాలి: MP లావు

AP: రాష్ట్రంలోని పత్తి రైతుల సమస్యలను MP లావు శ్రీకృష్ణ దేవరాయలు లోక్సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘కేంద్రం AP పత్తి రైతులను ఆదుకోవాలి. ‘మొంథా తుఫాను వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తేమశాతం ఎక్కువగా ఉన్న, రంగు మారిన పత్తిని కూడా CCI కొనుగోలు చేసేలా కేంద్రమే చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. పత్తి కొనుగోళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చిస్తోంది.


