News May 3, 2024
2 కోట్ల ఖాతాలను నిషేధించిన వాట్సాప్!

ఈ ఏడాది తొలి 3 నెలల్లో భారత్లో 2.2 కోట్ల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. గత ఏడాది ఇదే కాలానితో పోలిస్తే ఇది రెట్టింపు కావడం గమనార్హం. వాట్సాప్ నెలవారీ నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. భారత చట్టాలను అతిక్రమించిన ఖాతాలు, గ్రీవెన్స్ కమిటీ సూచించినవి, వినియోగదారులు ఫిర్యాదు చేసినవి వీటిలో ఉన్నాయని తెలిపింది. తమ మార్గదర్శకాలకు, దేశ చట్టాలకు లోబడి ఉండని ఖాతాలను ఇలాగే తొలగిస్తామని స్పష్టం చేసింది.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


