News April 25, 2025
143 మంది యాక్టర్లతో వాట్సాప్ గ్రూప్.. కానీ: నాని

బన్నీ, రానా, రామ్ చరణ్, మంచు లక్ష్మి సహా 143 మంది తెలుగు యాక్టర్లతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఉందని హీరో నాని తెలిపారు. అయితే అది ప్రస్తుతం యాక్టివ్గా లేదని, తాను కూడా ఆ గ్రూప్ను మ్యూట్లో ఉంచుతానని చెప్పారు. సినిమాలను ప్రోత్సహించుకోవడానికి దాన్ని క్రియేట్ చేశామన్నారు. అప్పట్లో బాగా చాట్ చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయిందని పేర్కొన్నారు. కాగా ఆయన నటించిన ‘హిట్-3’ మే 1న రిలీజ్ కానుంది.
Similar News
News April 25, 2025
సరిహద్దుల్లో హైటెన్షన్.. సైనికులకు సెలవులు రద్దు

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకోవడంతో పారా మిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేశారు. సెలవుపై వెళ్లిన సైనికులను వెంటనే రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు శ్రీనగర్ చేరుకున్న ఆర్మీ చీఫ్ ద్వివేది, సరిహద్దుల్లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. LoC వద్ద పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
News April 25, 2025
మరో మైలురాయికి చేరువైన ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో మైలురాయి చేరనుంది. ఇవాళ SRHతో జరిగే మ్యాచుతో టీ20ల్లో 400 మ్యాచులు ఆడిన నాలుగో భారత ప్లేయర్గా నిలవనున్నారు. ఆయన కంటే ముందు రోహిత్ శర్మ(456), దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(407) ఉన్నారు. ఇప్పటివరకు 399 మ్యాచుల్లో 38 సగటుతో 7,566 పరుగులు చేశారు. ఇందులో 28 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
News April 25, 2025
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే ఉంది: డానిష్ కనేరియా

పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. ‘టెర్రరిస్టులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడం దారుణం. ఆయన వ్యాఖ్యలు నిజంగానే పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఉన్నాయి’ అని ఎక్స్లో మండిపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపైనా డానిష్ దాయాది దేశాన్ని విమర్శించారు. అతడు ప్రస్తుతం USలో నివాసముంటున్నారు.