News September 20, 2024

తిరుమలలో లడ్డూ ప్రసాదం ఎప్పుడు మొదలైందంటే..

image

భక్తులు అమృతంగా భావించే తిరుమల లడ్డూ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? దీనిపై భిన్న కథనాలున్నాయి. అయితే 1803 నుంచి బూందీ ప్రసాద వితరణ ప్రారంభమైందనేది చరిత్రకారుల అంచనా. ఆ తర్వాత అనేక మార్పులతో 1940 నాటికి ఇప్పుడున్న లడ్డూగా స్థిరపడిందని చెబుతున్నారు. అంతకంటే ముందు తిరుప్పొంగం, సుఖీయం, 1455లో అప్పం, వడ(1460), అత్తిరసం(1468), మనోహరపడి(1547) ప్రసాదాలను భక్తులకు అందించేవారని తెలుస్తోంది.

Similar News

News November 24, 2025

దివ్యాంగురాలి దగ్గరకు వెళ్లి అర్జీ తీసుకున్న ప.గో కలెక్టర్

image

అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కాగా, ఓ దివ్యాంగురాలు అర్జీ ఇచ్చేందుకు రాగా.. కలెక్టర్‌ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.

News November 24, 2025

BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<>BELO<<>>P)3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ప్రాసెస్ ఇంజినీర్, ల్యాబోరేటరీ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News November 24, 2025

భారత్‌కు మరో ఓటమి తప్పదా?

image

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.