News August 29, 2024
ఉచిత చేప పిల్లల పంపిణీ ఎప్పుడంటే?

TG: రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీని అక్టోబర్లో చేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేస్తోంది. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా వచ్చే నెలలో గుత్తేదారులను ఎంపిక చేయనుంది. రూ.100 కోట్లతో 85.35 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. జులైలో ఈ సరఫరా జరగాల్సి ఉండగా ఈ సారి ఆలస్యమైంది. వర్షాలు కురుస్తుండడంతో ఆలస్యమైనా పంపిణీకి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు.
Similar News
News November 23, 2025
57 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన ఏనుగు

MPలోని పన్నా టైగర్ రిజర్వులో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. 57 ఏళ్ల అనార్కలి అనే ఏనుగు కవలలకు జన్మనివ్వడంతో అడవి సిబ్బంది, వన్యప్రాణి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏనుగు ఒక్క పిల్లకే జన్మనిస్తుంది. కానీ పన్నా చరిత్రలో తొలిసారిగా 3 గంటల వ్యవధిలో 2 పిల్లలు పుట్టాయి. దీంతో ఈ టైగర్ రిజర్వులో ఏనుగుల సంఖ్య 21కు చేరింది. గత 39 ఏళ్లలో పన్నాలో ఈ ఏనుగు ఇప్పటివరకు ఆరు సార్లు ప్రసవించింది.
News November 23, 2025
డిసెంబర్ 6న వైజాగ్కు రోహిత్, కోహ్లీ

IND, SA మధ్య ఈనెల 30 నుంచి 3 మ్యాచుల వన్డే సిరీస్ జరగనుంది. చివరి వన్డేను విశాఖలోని ACA-VDCA స్టేడియంలో ఆడనున్నారు. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూసే అవకాశం AP క్రికెట్ ఫ్యాన్స్కు దక్కనుంది. ఈ మ్యాచు టికెట్లు NOV 28 నుంచి విక్రయించనున్నారు. డిస్ట్రిక్ట్ యాప్లో 22,000 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధర ₹1200-18,000 మధ్య ఉంటుంది.
News November 23, 2025
స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదా?

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ‘సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు స్త్రీల ఉదర భాగం నేలకు తాకుతుంది. ఆ ప్రదేశంలో గర్భకోశం ఉంటుంది. కాబట్టి గర్భకోశానికి హాని కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకే స్త్రీలు అలా చేయకూడదు. బదులుగా మోకాళ్లపై కూర్చొని, తలను వంచి సాదర నమస్కారం చేయవచ్చు. అలాగే నడుము వంచి కూడా ప్రార్థించవచ్చు. సాష్టాంగ నమస్కారం పురుషులకు మాత్రమే’ అని చెబుతున్నారు.


