News August 28, 2024

డీఎస్సీ ఫైనల్ కీ ఎప్పుడంటే?

image

TG: డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అనంతరం జిల్లాల వారీగా ర్యాంకుల జాబితాను వెల్లడించనుంది. రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనుంది. ఆ తర్వాత మెరిట్ ఉన్న వారికి జాయినింగ్ ఆర్డర్స్‌ను అధికారులు ఇవ్వనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు జులై 18 నుంచి ఆగస్టు 5వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.

Similar News

News December 13, 2025

పాల మొదటి 2 ధారలు, గోటి పరీక్ష ముఖ్యం

image

☛ కొన్ని గేదెల పొదుగు పెద్దగా ఉన్నా లోపల పొదుగు వాపు ఉండే ఛాన్సుంది. అందుకే నల్లటి గిన్నెలో పాలను పితికి మొదటి రెండు ధారలను పరిశీలించాలి. అందులో గడ్డలు, రక్తం లేదా నీళ్ల విరుగుడు కనిపిస్తే ఆ గేదెను కొనవద్దు.
☛ మెషిన్ లేకుండానే పాలలో వెన్నశాతం చెక్ చేయాలి. దీనికి పాలు పితికిన వెంటనే ఒక చుక్కపాలను బొటన వేలు గోరు మీద వేయాలి. ఆ చుక్క జారిపోకుండా గోరు మీదే ఉంటే అవి చిక్కటి పాలుగా గుర్తించాలి.

News December 13, 2025

దోషాలను తొలగించే ‘కూష్మాండ దీపం’

image

ఇంట్లో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తే అఖండ ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. దృష్టి, నర, శని దోషాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘ఈ దీపం వెలిగించడం వల్ల కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. చండీ హోమంతో సమానమైన ఫలితం దక్కుతుంది. ఆర్థిక, ఆరోగ్య, సంతాన సమస్యలను తొలగించుకోవడానికి ఈ పరిహారం పాటించాలి’ అని సూచిస్తున్నారు. కూష్మాండ దీపాన్ని ఎప్పుడు, ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News December 13, 2025

నిద్రలో పళ్లుకొరుకుతున్నారా?

image

నిద్రలో కొంద‌రు ప‌ళ్ల‌ను కొరుకుతుంటారు. దీన్ని బ్ర‌క్సిజం అంటారు. ఎక్కువ ఆందోళ‌న‌, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్త‌త ఎక్కువ‌గా ఉంటే నిద్ర‌లో ఇలా ప‌ళ్లు కొరుకుతార‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే చిన్నారుల్లో పేగుల్లో పురుగులు ఉన్నా, కాల్షియం, మెగ్నీషియం లోపాలు ఉన్నా వారు నిద్ర‌లో ప‌ళ్ల‌ను కొరుకుతారని అంటున్నారు. అందుకే చిన్నారుల‌కు పోష‌కాహారం ఇస్తే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చని చెబుతున్నారు.