News August 28, 2024
డీఎస్సీ ఫైనల్ కీ ఎప్పుడంటే?

TG: డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అనంతరం జిల్లాల వారీగా ర్యాంకుల జాబితాను వెల్లడించనుంది. రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనుంది. ఆ తర్వాత మెరిట్ ఉన్న వారికి జాయినింగ్ ఆర్డర్స్ను అధికారులు ఇవ్వనున్నారు. మొత్తం 11,062 పోస్టులకు జులై 18 నుంచి ఆగస్టు 5వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News December 12, 2025
పుంగనూరు: జిల్లాలో నేటి టమాటా ధరలు

చిత్తూరు జిల్లాలో టమాట ధరలు శుక్రవారం ఇలా ఉన్నాయి. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో నాణ్యత కలిగిన మొదటి రకం టమాటాలు గరిష్ఠంగా 10 కిలోలు రూ. 320, పలమనేరు మార్కెట్ లో రూ.310, వీకోట మార్కెట్ లో రూ. 300 వరకు పలికాయి. మూడు మార్కెట్లకు కలిపి 94 మెట్రిక్ టన్నుల కాయలు రైతులు తీసుకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.
News December 12, 2025
నా వ్యక్తిత్వ హక్కులను కాపాడండి.. హైకోర్టులో పవన్ పిటిషన్

AP: తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలంటూ Dy.CM పవన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. AI వీడియోలతో పవన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా SMలో పోస్టులు చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. దీంతో డిలీట్ చేసేందుకు ఆ లింక్లను 48hrsలోపు SM సంస్థలకు అందించాలని న్యాయమూర్తి సూచించారు. వాటిపై వారంలోపు చర్యలు తీసుకోవాలని గూగుల్, మెటా తదితర ప్లాట్ఫామ్లను ఆదేశిస్తూ తదుపరి విచారణను DEC 22కు వాయిదా వేశారు.
News December 12, 2025
వాట్సాప్లో మరో 2 కొత్త ఫీచర్లు

మెసేజింగ్ యాప్ వాట్సాప్ రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ కాల్ రిసీవ్ చేసుకోని వారికి వాయిస్ మెసేజ్ పంపే వెసులుబాటు కల్పించింది. వాయిస్ కాల్ చేస్తే వాయిస్ మెసేజ్, వీడియో కాల్ చేస్తే వీడియో మెసేజ్ పంపించే వన్ టచ్ ఆప్షన్ ప్రవేశపెట్టింది. వాయిస్మెయిల్ పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉండేది. ఫ్లక్స్, మిడ్ జర్నీల సహకారంతో కొత్త తరహా ఇమేజ్లను క్రియేట్ చేసుకునే ఫీచర్ తీసుకొచ్చింది.


