News March 24, 2024

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

AP: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా.. ఇంత తక్కువ కేసులు నమోదు కావడం బోర్డు చరిత్రలో ఇదే తొలిసారి. ఇప్పటికే వాల్యుయేషన్ ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఆ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు.

Similar News

News December 26, 2025

ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు జరిగే CWC సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై చర్చించనున్నట్లు సమాచారం.

News December 26, 2025

అసెంబ్లీకి కేసీఆర్?

image

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో మాజీ మంత్రులతో సమావేశంలో చెప్పినట్లు సమాచారం. సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే ఆయన కూడా అసెంబ్లీకి వచ్చి సర్కార్‌ను ఇరుకున పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

News December 26, 2025

చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ

image

భారత మహిళా క్రికెటర్ దీప్తీ శర్మ T20I ఫార్మాట్‌లో 150 వికెట్లు పూర్తి చేసుకున్నారు. శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్, ఓవరాల్‌గా రెండో మహిళగా నిలిచారు. తొలిస్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మేగన్(151) ఉన్నారు. ఇదే మ్యాచ్‌లో 151వ వికెట్‌ను కూడా తీసి ఆమె రికార్డును దీప్తి సమం చేశారు.