News March 24, 2024

బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడో?

image

AP: ఎన్డీయే కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాను తుది దశకు తెచ్చేశాయి. కానీ బీజేపీ మాత్రం ఇంకా నాన్చుడు ధోరణిలోనే ఉండటం కూటమి ప్రచారానికి స్పీడ్ బ్రేకర్‌గా మారుతోంది. పొత్తులో భాగంగా 8 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేయాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీకి ప్రస్తుతం స్పష్టత లేదంటున్నారు పరిశీలకులు. అందుకే ప్రకటనలో ఆలస్యం జరుగుతోందని విశ్లేషిస్తున్నారు.

Similar News

News September 14, 2025

కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు

image

TG: రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని BRS MLA హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. రీయింబర్స్‌మెంట్, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ప్రాజెక్టులకు ₹కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే తక్కువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖ మంత్రిగానూ రేవంత్ నిలిచిపోతారన్నారు.

News September 14, 2025

రేపు డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్

image

AP: డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్టులను రేపు విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ తుది ఎంపిక జాబితాలు DEO, కలెక్టర్ కార్యాలయాల్లో, https://apdsc.apcfss.in/లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ఈ నెల 19న అమరావతిలో అపాయింట్‌మెంట్ లెటర్లను అందజేయనున్నారు. 16,347 ఉద్యోగాలకు ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News September 14, 2025

రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని CM ఇప్పటికే వెల్లడించారు. తొలిరోజు వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల పురోగతితో పాటు సూపర్ సిక్స్ పథకాలు, అన్న క్యాంటీన్లు, P-4పై సమీక్షించనున్నారు. రెండో రోజు వైద్యం, క్వాంటం వ్యాలీ, మున్సిపల్, పంచాయతీరాజ్ అంశాలపై చర్చించనున్నారు.