News July 16, 2024
మరో డీఎస్సీ ఎప్పుడంటే?

TG: డీఎస్సీ ఉద్యోగాలు పెంచాలని అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్లో టెట్ నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల మొత్తం 1,25,058 ఉండగా 1.03 లక్షల మంది విధుల్లో ఉన్నారు.
Similar News
News January 26, 2026
తెలుగు రాష్ట్రాల్లో ఎట్ హోం.. హాజరైన ప్రముఖులు

తెలుగు రాష్ట్రాల లోక్భవన్లలో ‘ఎట్ హోం’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. AP గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ సహా కీలక నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఇటు TGలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో Dy.CM భట్టి సహా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చారు.
News January 26, 2026
గోళ్లు విరిగిపోతున్నాయా?

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.
News January 26, 2026
T20 WCలో పాక్ ఆడుతుందా? సీన్లోకి ఆ దేశ ప్రధాని..

T20 వరల్డ్ కప్లో పాకిస్థాన్ ఆడుతుందా.. లేదా.. అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. దీనిపై ఈరోజు PCB ఛైర్మన్ నఖ్వీ తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. ‘బాయ్కాట్’ ఆలోచన ఇంకా తమ పరిశీలనలోనే ఉందని తెలిపారు. దీనిపై తుది నిర్ణయం వచ్చే శుక్రవారం లేదా సోమవారం తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే టీమ్ను ప్రకటించగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే పాక్ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


