News July 16, 2024
మరో డీఎస్సీ ఎప్పుడంటే?

TG: డీఎస్సీ ఉద్యోగాలు పెంచాలని అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్లో టెట్ నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల మొత్తం 1,25,058 ఉండగా 1.03 లక్షల మంది విధుల్లో ఉన్నారు.
Similar News
News February 12, 2026
ఇంటర్ సెకండియర్లో NCERT ఆధారిత సిలబస్

AP: ఇంటర్ సెకండియర్లో 2026-27 నుంచి NCERT ఆధారిత సిలబస్ను అమలు చేస్తామని బోర్డు ప్రకటించింది. ‘సైన్సులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ (బోటనీ, జువాలజీ కలిపి) ఉంటాయి. ఆర్ట్స్లో సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్, హిస్టరీలుంటాయి. భాషల్లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ ఉంటాయి’ అని బోర్డు తెలిపింది. ఫస్టియర్లోని సవరించని 5 సబ్జెక్టులను 2026-27 నుంచి సవరించి అమలు చేస్తామని పేర్కొంది.
News February 12, 2026
టాస్ గెలిచిన నమీబియా.. భారత్ బ్యాటింగ్

టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్తో మ్యాచులో నమీబియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ చేయనుంది. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ దూరమయ్యారు. అతడి ప్లేస్లో సంజూ శాంసన్ వచ్చారు. సిరాజ్ స్థానంలో బుమ్రా ఆడనున్నారు.
IND: శాంసన్, కిషన్, తిలక్, సూర్య, దూబే, రింకూ, హార్దిక్, అక్షర్, అర్ష్దీప్, చక్రవర్తి, బుమ్రా
News February 12, 2026
రూ.55,649 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

రోజుకో రీతిలో సాగుతున్న సైబర్ మోసాలతో ప్రజలు ₹వేలకోట్లు నష్టపోతున్నారు. గత 5 ఏళ్లలో 65,89,063 మంది బాధితులు ₹55,649 CR పోగొట్టుకున్నారు. ఈ మోసాలు ఏటేటా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. 2021లో 2,62,846 ఫిర్యాదులు రాగా ₹551 CR మోసపోయారు. అదే 2025లో 24,02,579లు కేసులు నమోదైతే మోసపోయిన సొమ్ము ₹22,495 CRకు చేరింది. కాగా 23.61 లక్షల కేసుల్లో ₹8189 కోట్లు కాపాడగలిగామని కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది.


