News July 16, 2024
మరో డీఎస్సీ ఎప్పుడంటే?

TG: డీఎస్సీ ఉద్యోగాలు పెంచాలని అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్లో టెట్ నిర్వహించే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల మొత్తం 1,25,058 ఉండగా 1.03 లక్షల మంది విధుల్లో ఉన్నారు.
Similar News
News February 11, 2026
ఆకాశంలో అద్భుతం.. ‘హృదయ’ కాంతిని చూడండి!

ప్రేమికుల రోజుకు ముందు ఆకాశంలో అద్భుతం జరిగింది. హృదయపు ఆకారంలో ఏర్పడిన నార్తర్న్ లైట్స్ కనువిందు చేస్తున్నాయి. వినీల ఆకాశంలో ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తున్న ‘హార్ట్’ను నార్వేలో క్రిస్టొఫర్ వెంజెన్ బంధించారు. శీతాకాలంలో ఆర్కిటిక్ సమీపంలో ఈ నార్తర్న్ లైట్స్ కనిపిస్తాయి. సూర్యుడి నుంచి వెలువడే ఛార్జ్డ్ కణాలు ఆక్సిజన్, నైట్రోజన్తో ఢీకొన్నప్పుడు ఆకుపచ్చ, పింక్, ఎరుపు, నీలం రంగు కాంతులను వెదజల్లుతాయి.
News February 11, 2026
నటుడి ఆవేదన.. సాయానికి ముందుకొస్తున్న సెలబ్రిటీలు

₹9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో నటుడు రాజ్పాల్ యాదవ్ <<19103948>>జైలులో సరెండరైన<<>> విషయం తెలిసిందే. ఆదుకునేందుకు ఎవరూ రాలేదంటూ వాపోయిన ఆయన కోసం సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. రాజ్పాల్కు తన చిత్రంలో అవకాశం ఇస్తానని సోనూ సూద్ తెలిపారు. తాను ₹1.1 కోట్లు ఇస్తానని GemTunes Music ఓనర్ రావ్ ఇంద్రిజిత్ సింగ్ ప్రకటించారు. నటుడు గుర్మీత్, పొలిటీషియన్ తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా సాయం చేస్తామని అన్నారు.
News February 11, 2026
మెంటార్ని ఎంచుకుంటున్నారా?

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.


