News February 6, 2025
ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు?: బొప్పరాజు

AP: కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా ఉద్యోగుల సమస్యలపై చర్చించలేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీకి ఛైర్మన్ను నియమించలేదని దుయ్యబట్టారు. ఉద్యోగులు మధ్యంతర భృతి(IR) కోరతారనే నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు చర్చ జరుగుతోందన్నారు. తమకు రావాల్సిన బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని, క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 27, 2025
అత్యుత్తమ వివాహ రకమిదే..

వివాహాలన్నింటిలో బ్రాహ్మమును ధర్మబద్ధమైనదిగా పరిగణిస్తారు. ఈ పద్ధతిలో వధువు తండ్రి తగిన అర్హతలు గల వరుడిని స్వయంగా అన్వేషించి, ఆహ్వానిస్తారు. తన కుమార్తెను ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా దానం చేస్తారు. ఇది ధర్మ సంయోగానికి ప్రతీక. ఈ దానం ద్వారా వధువు తండ్రి పుణ్యాన్ని పొందుతాడు. వధూవరులు ధార్మిక జీవితాన్ని ప్రారంభించి, సుఖసంతోషాలతో, ఉత్తమ గతులు పొందుతారు. ఇది దైవిక ఆశీస్సులతో కూడిన వివాహ బంధం. <<-se>>#Pendli<<>>
News October 27, 2025
కాకినాడకు 490KMల దూరంలో తుఫాన్

AP: మొంథా తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి 440KM, విశాఖకు 530KM, కాకినాడకు 490 KMల దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA అధికారులు తెలిపారు. గడిచిన 6 గంటల్లో 17KMPHతో కదిలిందని పేర్కొన్నారు. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం 4PM నుంచి 11PM మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. ఆ సమయంలో భారీ గాలులు, వర్షాలు కురుస్తాయని వివరించారు.
News October 27, 2025
రేపు విజయవాడలో భారీ వర్షాలు.. బయటకు రావొద్దని వార్నింగ్

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 16 CMలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, మాల్స్ మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, మిల్క్ దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు.
*కలెక్టరేట్ కంట్రోల్ నం.9154970454


