News February 6, 2025

ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు?: బొప్పరాజు

image

AP: కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా ఉద్యోగుల సమస్యలపై చర్చించలేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీకి ఛైర్మన్‌ను నియమించలేదని దుయ్యబట్టారు. ఉద్యోగులు మధ్యంతర భృతి(IR) కోరతారనే నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు చర్చ జరుగుతోందన్నారు. తమకు రావాల్సిన బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని, క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 6, 2025

ప్రైవేటు స్కూళ్లు ట్యూషన్ ఫీజు పెంచుకోవచ్చు: కమిషన్

image

TG: ప్రైవేటు స్కూళ్లు ఏడాదికోసారి ట్యూషన్ ఫీజును పెంచుకోవచ్చని విద్యాకమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కమిషన్ సిఫార్సులివే: విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయుల్లో కలెక్టర్ నేతృత్వంలో కమిటీలుండాలి. ఇవి ఫీజుల్ని నియంత్రిస్తాయి. ఎక్కువ వసూలు చేసే స్కూళ్లకు భారీ జరిమానా విధిస్తారు. ఫీజుల వివరాలను అందరికీ తెలిసేలా వెబ్‌సైట్‌లో పెట్టాలి.

News February 6, 2025

ఎవరెస్టు అధిరోహకులకు నేపాల్ కొత్త నిబంధన

image

తమ దేశం పరిధిలో ఉన్న హిమాలయ పర్వతాలను అధిరోహించే వారికి నేపాల్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. 8వేల మీటర్ల ఎత్తు దాటి పైకి వెళ్లేవారిని ఒంటరిగా వెళ్లనివ్వమని స్పష్టం చేసింది. కచ్చితంగా సహాయక సిబ్బంది లేదా గైడ్‌తో కలిసి వెళ్లాలని సూచించింది. 8వేల అడుగులు దాటాక పరిస్థితులు కఠినంగా ఉంటాయి. ఆక్సిజన్ అందని కారణంగా పర్వతారోహకులు ప్రాణాపాయంలో పడతారు. ఈ నేపథ్యంలోనే నేపాల్ తాజా నిబంధన తీసుకొచ్చింది.

News February 6, 2025

APPLY.. రూ.72,000 జీతంతో ఉద్యోగాలు

image

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ అర్హతతో పాటు ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయోపరిమితి ఉంది. రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అప్లికేషన్లకు చివరి తేది మార్చి 8. జీతం గరిష్ఠంగా రూ.72,000 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

error: Content is protected !!