News October 6, 2025
శివుణ్ని ఏ సమయంలో దర్శించుకోవాలి?

పరమేశ్వరుని ఆలయానికి సాయంత్రం వెళ్లడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఆ సమయంలో శివ లింగాన్ని దర్శించుకుంటే శుభం కలుగుతుందని అంటున్నారు. రోజు పూర్తయ్యే సమయంలో ఆ లయకారుణ్ని దర్శించుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి తొందరపాటు లేకుండా, ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు. <<-se>>#DharmaSandehalu<<>>
Similar News
News March 29, 2026
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఫలితాలు విడుదల

TG: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 174 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మెరిట్ జాబితా విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 1న HYDలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. ఇందులో గైనకాలజీ, అనస్తీషియా వంటి కీలక విభాగాలున్నాయి. ఇక 2,312 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల తుది ఫలితాలను ఏప్రిల్ 9న వెల్లడిస్తామని రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ నియామకాలతో ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
News March 29, 2026
మహిళలకు రూ.2 వేలు, రైతులకు పంపుసెట్లు: DMK మ్యానిఫెస్టో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అధికార డీఎంకే వరాల జల్లు కురిపించింది. మహిళలకు ప్రతి నెలా ₹2 వేలు ఇస్తామని ప్రకటించింది. పెన్షన్ను ₹2 వేలకు పెంచుతామని, రైతులకు ఉచితంగా పంపుసెట్లు అందజేస్తామని తెలిపింది. మహిళా సంఘాలకు ₹5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామని పేర్కొంది. స్టూడెంట్లకు ఫ్రీగా ల్యాప్టాప్లు, 8వ తరగతి వరకు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేస్తామని వెల్లడించింది.
News March 29, 2026
గుడ్న్యూస్.. 94 వేల మెట్రిక్ టన్నుల LPG వస్తోంది!

దేశంలోని బంకుల్లో అవసరమైనంత మేర పెట్రోల్, డీజిల్ ఉందని పెట్రోలియం శాఖ తెలిపింది. 94 వేల మెట్రిక్ టన్నుల LPGతో 2 కార్గో షిప్లు భారత తీరాలకు వస్తున్నాయని చెప్పింది. వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. గృహ వినియోగదారులకు నిన్న 55 లక్షలకు పైగా LPGలు రీఫిల్ చేశామని, సిలిండర్ల డెలివరీలు సాధారణంగా ఉన్నాయని వివరించింది. గల్ఫ్, పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.


