News May 12, 2024

TS EAPCET ఫలితాలు ఎప్పుడంటే?

image

TS EAPCET ఫలితాలు ఈనెల 25న లేదా 27న విడుదలయ్యే అవకాశం ఉంది. ఫలితాల విడుదల కోసం జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 7న ప్రారంభమైన EAPCET పరీక్షలు నిన్నటితో ముగిశాయి. గతేడాది మే 14న పరీక్షలు పూర్తవగా, అదే నెల 25న రిజల్ట్స్ వెల్లడించారు. దీంతో ఈసారి కూడా ఒకరోజు అటుఇటుగా ఫలితాలు విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈసారి ఇంజినీరింగ్ విభాగం పరీక్షలకు 2.40లక్షల మంది హాజరయ్యారు.

Similar News

News October 20, 2025

ఇన్ఫోసిస్ ఏపీకి వెళ్లిపోతే?.. కర్ణాటక ప్రభుత్వంపై కుమారస్వామి ఫైర్

image

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఫైరయ్యారు. పారిశ్రామికవేత్తలతో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. ‘ఇన్ఫోసిస్ <<18031642>>నారాయణమూర్తి<<>>, సుధామూర్తి దంపతులను అవమానించేలా సీఎం సిద్దరామయ్య మాట్లాడటం దారుణం. ఒకవేళ ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలను ఏపీకి మారిస్తే పరిస్థితి ఏంటి? ‘మీ అవసరం మాకు లేదు’ అన్నట్లు వ్యవహరించడం రాష్ట్రానికే నష్టం’ అని వ్యాఖ్యానించారు.

News October 20, 2025

దీపాలు వెలిగించేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఆనందకరమైన దీపావళి పండగను జరుపుకొనే సమయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. దీపాలకు తగులుతాయి అనుకున్న కర్టెన్లను వీలైతే కొన్నిరోజుల పాటు తీసి పక్కన పెట్టేయండి. దుస్తులు దీపాలకు అంటకుండా చూసుకోవాలి. లూజుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. పిల్లలు బాణసంచా కాలుస్తుంటే పక్కనే పెద్దవాళ్లు ఉండాలి. టపాసులు కాల్చేటపుడు షూ, కళ్లజోడు ధరించాలి. కాకర్స్‌ను దీపాలకు దూరంగా పెట్టుకోవాలి.

News October 20, 2025

రాష్ట్రంలో 97 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో వివిధ విభాగాల్లో 97 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వైద్య విద్య ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల సమాచారం కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.