News January 16, 2025

మన స్టార్ క్రికెటర్లు చివరిగా రంజీలు ఎప్పుడు ఆడారంటే?

image

జూనియర్, సీనియర్ తేడా లేకుండా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని BCCI స్పష్టం చేసింది. దీంతో కొందరు రంజీలకు సిద్ధమవగా, మరికొందరు ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో మన స్టార్ క్రికెటర్లు చివరిసారిగా రంజీ మ్యాచ్‌లు ఎప్పుడు ఆడారో తెలుసుకుందాం. కోహ్లీ(DEL)-2012, రోహిత్(MUM)-2015, బుమ్రా(GUJ)-2017, పంత్(DEL)-2018, రాహుల్(KAR)-2020, జడేజా(SAU)-2023.

Similar News

News November 8, 2025

అశ్వని కురిస్తే అంతా నష్టం

image

అశ్వని కార్తె వేసవి ప్రారంభంలో(ఏప్రిల్-13/14) నుంచి వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పడితే, దాని ప్రభావం తర్వాత ముఖ్యమైన వర్షాధార కార్తెలైన భరణి, కృత్తిక, రోహిణిపై పడుతుందని, ఫలితంగా వర్షాలు సరిగ్గా కురవవని నమ్ముతారు. దీని వల్ల వ్యవసాయ పనులకు ఆటకం కలిగి పంట దిగుబడి తగ్గుతుందని, అన్నదాతలకు నష్టం వాటిల్లుతుందని ఈ సామెత వివరిస్తుంది.

News November 8, 2025

సంకటహర గణపతి ఎలా ఉంటాడంటే..?

image

ముద్గల పురాణం ప్రకారం.. విఘ్నేశ్వరుడికి మొత్తం 32 దివ్య స్వరూపాలున్నాయి. అందులో చివరిది, విశిష్టమైనది సంకటహర గణపతి. ఈ స్వామి రూపం ప్రశాంతంగా ఉంటుంది. కుడి చేయి వరద హస్త భంగిమలో, ఎడమ చేతిలో పాయస పాత్రతో, దేవేరిని ప్రేమగా ఎడమ తొడపై కూర్చోబెట్టుకుని కన్పిస్తారు. కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థి అంటే గణపతికి చాలా ఇష్టమట. ఈ రోజున భక్తితో ఆయన వ్రతం చేస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News November 8, 2025

కీలక పోరు.. సూర్య రాణిస్తారా?

image

AUS-IND మధ్య బ్రిస్బేన్ వేదికగా ఇవాళ ఆఖరి T20 జరగనుంది. భారత్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే ఈ మ్యాచులో గెలిచి తీరాల్సిందే. ఈ కీలక పోరులో కెప్టెన్ సూర్య, తిలక్ ఫామ్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ మ్యాచులో భారత్ పలు మార్పులు చేసే ఛాన్సుంది. గిల్ స్థానంలో శాంసన్‌, దూబే స్థానంలో నితీశ్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మ్యాచ్ 1:45PMకి ప్రారంభమవుతుంది. కాగా ఐదు T20ల సిరీస్‌లో IND 2-1తో ఆధిక్యంలో ఉంది.