News July 10, 2024
పూరీ రత్నభాండాగారాన్ని తెరిచేది ఎప్పుడంటే..

పూరీ జగన్నాథుడి ఆలయం కింద రత్నభాండాగారాన్ని ఈ నెల 14న తెరవాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు రథ్ తెలిపారు. ‘ఈ 14న గదిని తెరిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. ముందుగానే గది తాళం ఇవ్వాలని క్షేత్ర పాలనాధికారికి చెప్పాం. రథయాత్ర కారణంగా అది సాధ్యం కాలేదు. మా నిర్ణయాలను ఆలయ కమిటీకి పంపుతాం. వారు ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తారు’ అని తెలిపారు.
Similar News
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<
News September 18, 2025
త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్: CEA

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.