News July 10, 2024
పూరీ రత్నభాండాగారాన్ని తెరిచేది ఎప్పుడంటే..

పూరీ జగన్నాథుడి ఆలయం కింద రత్నభాండాగారాన్ని ఈ నెల 14న తెరవాలని జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్లు రథ్ తెలిపారు. ‘ఈ 14న గదిని తెరిపించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. ముందుగానే గది తాళం ఇవ్వాలని క్షేత్ర పాలనాధికారికి చెప్పాం. రథయాత్ర కారణంగా అది సాధ్యం కాలేదు. మా నిర్ణయాలను ఆలయ కమిటీకి పంపుతాం. వారు ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తారు’ అని తెలిపారు.
Similar News
News November 24, 2025
యూకేని వీడనున్న మిట్టల్!

భారత సంతతి వ్యాపారవేత్త లక్ష్మీ ఎన్. మిట్టల్ యూకేని వీడనున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెరగడం, కుటుంబ వ్యాపారాలపై కొత్త రూల్స్, ప్రపంచంలో ఎక్కడ సంపాదించినా యూకేలో పన్ను చెల్లించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పన్నులు లేని దుబాయ్లో సెటిల్ కానున్నారు. ఇప్పటికే అక్కడ ఓ ల్యాండ్ కొన్నారు. కాగా మిట్టల్ $21.4 బిలియన్ల సంపదతో ప్రపంచ ధనవంతుల్లో 104వ స్థానంలో ఉన్నారు.
News November 24, 2025
బీసీలకు రాహుల్ గాంధీ అన్యాయం: కేటీఆర్

తెలంగాణ బీసీలకు రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతామని KTR అన్నారు. ‘ఆయన వెంటనే BC రిజర్వేషన్ల అంశాన్ని పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూడాలి. BJP సహకరించకుంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలి. స్థానిక సంస్థల రిజర్వేషన్ల చుట్టే మొత్తం అంశాన్ని తిప్పుతూ బీసీల విద్య, ఉపాధి, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ ఇచ్చే అంశాన్ని పక్కనపెట్టారు’ అని కార్యకర్తల సమావేశంలో విమర్శించారు.
News November 24, 2025
ఐబొమ్మ రవి సంపాదన రూ.100 కోట్లు?

మూవీల పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్తో ఐబొమ్మ <<18377140>>రవి<<>> రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్ను సేకరించినట్లు సమాచారం. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్కు లింక్ అయ్యేలా వెబ్సైట్లో ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరోవైపు ఈ విచారణపై రేపు ప్రెస్మీట్లో సజ్జనార్ వివరాలను వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


