News March 18, 2024

టెట్ ఫలితాల విడుదల ఎప్పుడు?

image

AP: గత నెలలో నిర్వహించిన ‘టెట్’ ఫలితాలు ఈ నెల 14నే విడుదల కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టెట్‌ను విడతలవారీగా నిర్వహించినందున మార్కులను నార్మలైజేషన్ చేయాల్సి ఉండటంతో ఆలస్యం అయినట్లు సమాచారం. టెట్‌లో అర్హత సాధిస్తేనే DSCకి అర్హులవుతారు. అలాగే టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. ఈ నెల 30 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

Similar News

News March 18, 2026

ఈ టీమ్స్ టాపార్డర్ చూస్తే వణకాల్సిందే..

image

IPLలో ఈ సారి చాలా జట్ల టాపార్డర్ బలంగా ఉంది.
*SRH: అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్, క్లాసెన్
*MI: రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్, విల్ జాక్స్
*CSK: మాత్రే, శాంసన్, గైక్వాడ్, శివమ్ దూబే
*KKR: అలెన్, సీఫర్ట్, గ్రీన్, రహానే
*LSG: మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్
*PBKS: ప్రభ్‌సిమ్రాన్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్
> వీటిలో ఏ టీమ్ విధ్వంసకరంగా ఉందో కామెంట్ చేయండి.

News March 18, 2026

చైనాకు వెళ్లాల్సిన రష్యా ఆయిల్ నౌకలు భారత్‌కు!

image

రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను భారత్ డబుల్ చేసింది. ఎంతలా అంటే చైనాకు వెళ్లే ఆయిల్ షిప్పులను మళ్లించి భారత్‌కు పంపించేంతలా! ఆగ్నేయ ఆసియా నుంచి ఆక్వా టైటాన్ MAR 21న కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు చేరనుంది. భారత్ ఒక వారంలో రష్యా నుంచి 30 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. మొత్తం ఏడు నౌకలను చైనా నుంచి ఇండియాకు రష్యా డైవర్ట్ అయ్యాయి. కాగా రష్యా $98కు బ్యారెల్‌ చొప్పున ఆయిల్ అందిస్తోంది.

News March 18, 2026

రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటలు బయటకు రావొద్దు: APSDMA

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాలకు APSDMA రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో ప.గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.