News August 20, 2024
డీఎస్సీ ఫలితాలు ఎప్పుడంటే?

TG: డీఎస్సీ ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇటీవల 11,062 పోస్టులకు నిర్వహించిన పరీక్షలకు 2.45 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రిలిమినరీ కీని విడుదల చేయగా నేటితో అభ్యంతరాల స్వీకరణ ముగియనుంది. వచ్చే నెల రెండో వారంలో మెరిట్ లిస్ట్ 1:3 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Similar News
News December 29, 2025
నేటి ముఖ్యాంశాలు

* కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: PM మోదీ
* పేదల హక్కులపై BJP దాడి: ఖర్గే
* రేపు అసెంబ్లీకి హాజరుకానున్న కేసీఆర్
* నీటిపారుదల శాఖపై CM రేవంత్ సమీక్ష.. అసెంబ్లీలో లేవనెత్తే ప్రశ్నలపై వ్యూహం సిద్ధం
* అయోధ్యను దర్శించుకున్న CM CBN.. శ్రీరాముడి విలువలు అందరికీ ఆదర్శమని ట్వీట్
* శ్రీలంక ఉమెన్స్తో 4వ టీ20లో భారత్ విజయం
* భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రూ.300
News December 29, 2025
నెహ్రూ లేఖలను తిరిగి ఇచ్చేయండి: కేంద్రమంత్రి

జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక లేఖలు, పత్రాలు దేశ వారసత్వ సంపద అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. వీటిని వెంటనే ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ’కి తిరిగి అప్పగించాలని సోనియా గాంధీని కోరారు. అవి కుటుంబ ఆస్తి కాదని.. దేశ చరిత్రను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 2008లో దాదాపు 26,000 పత్రాలను తీసుకెళ్లారని.. గతంలో పలుమార్లు కోరినా తిరిగి ఇవ్వలేదని గుర్తు చేశారు.
News December 29, 2025
‘ఆరావళి’పై రేపు సుప్రీంలో విచారణ

<<18663286>>ఆరావళి పర్వతాల<<>> నిర్వచనంపై చెలరేగిన వివాదాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. ఆరావళి కొండలు, శ్రేణుల నిర్వచనం, అనుబంధ సమస్యల వివాదంపై ముఖ్యంగా విచారణ జరగనుంది. కాగా ఆరావళిలో మైనింగ్ <<18662201>>నిలిపివేస్తున్నట్లు<<>> కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.


