News February 27, 2025

మహా కుంభమేళా మళ్లీ ఎప్పుడంటే?

image

144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహా కుంభమేళా నిన్నటితో ముగిసింది. త్రివేణీ సంగమం వద్ద 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహా కుంభమేళా మళ్లీ 2169 సంవత్సరంలో రానుంది. ఇప్పుడున్న వాళ్లు ఎవరూ ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు. రాబోయే తరాలు ఆ మహా ఘట్టంలో భాగం కానున్నాయి.

Similar News

News February 27, 2025

కుంభమేళాలో పాల్గొంటే బీజేపీకి దగ్గరయినట్టా?: డీకే

image

తాను బీజేపీకి దగ్గరవుతున్నానని వస్తున్న పుకార్లన్నీ అబద్ధాలేనని కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ స్పష్టం చేశారు. ‘నేను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదిని. అయితే నా వ్యక్తిగత నమ్మకాలను నేను అనుసరిస్తాను. హిందువుగా పుట్టాను. హిందువుగానే జీవిస్తాను. హిందువుగానే మరణిస్తాను. కుంభమేళాకు వెళ్లినంత మాత్రాన బీజేపీకి దగ్గరవుతున్నానని చెబుతారా? కుంభమేళాకు యూపీ ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేసింది’ అని తెలిపారు.

News February 27, 2025

ఘోరం: ఆగి ఉన్న బస్సులో యువతిపై అత్యాచారం

image

పుణేలో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన జరిగింది. ఆగి ఉన్న బస్సులో యువతి(26)పై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సతారా జిల్లా ఫల్తాన్‌కు చెందిన యువతి పుణేలోని ఆసుపత్రిలో కౌన్సిలర్‌గా పనిచేస్తోంది. ఊరికి వెళ్లేందుకు స్వర్గేట్ బస్టాండ్‌కు వచ్చింది. బస్సు పక్కన నిలిపి ఉందని ఆమెను తీసుకెళ్లిన నిందితుడు రేప్‌ చేశాడు.

News February 27, 2025

Stock Markets: బ్యాంకు, మెటల్ షేర్ల జోరు

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సెంటిమెంటు నెగటివ్‌గా ఉండటమే ఇందుకు కారణాలు. నిఫ్టీ 22,559 (+11), సెన్సెక్స్ 74,639 (+40) వద్ద కొనసాగుతున్నాయి. INDIA VIX 13.37కు దిగిరావడం అనిశ్చితి తగ్గడాన్ని సూచిస్తోంది. బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ షేర్లకు గిరాకీ ఉంది. ఆటో, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయి.

error: Content is protected !!