News April 13, 2024

నేడు చంద్రబాబు ‘ప్రజాగళం’ సభలు ఎక్కడంటే?

image

AP: జనసేనాని పవన్‌తో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఉమ్మడి ప్రచారానికి కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇవాళ తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో చంద్రబాబు ‘ప్రజాగళం’ సభలు నిర్వహించనున్నారు. రేపు పాయకరావుపేట, చోడవరం, గాజువాకలో, ఈ నెల 15న రాజాం, పలాస, టెక్కలిలో సభలు నిర్వహించనున్నారు. 16, 17న ఇరువురు నేతలు కలిసి ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తారు.

Similar News

News January 21, 2026

కేంద్రం కీలక నిర్ణయం.. రైతులకు లాభం

image

నకిలీ, నాణ్యత లేని పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే వీటి తయారీ, విక్రయంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం ‘పురుగుమందుల నిర్వహణ బిల్లు, 2025’ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం నకిలీ పురుగు మందులను విక్రయిస్తే రూ.50 లక్షల వరకు జరిమానా, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సుంది. కేంద్రం నిర్ణయంలో కీలక అంశాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.

News January 21, 2026

ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్‌కు యాప్: తుమ్మల

image

TG: ఐదు జిల్లాల్లో అమలు చేసిన యూరియా యాప్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఈ విధానాన్ని మెచ్చుకుందన్నారు. నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో చలామణి అవుతున్న ఫేక్ ప్రొడక్ట్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఓ యాప్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో పంటను ఎక్కడ, ఎలా పండించారనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు.

News January 21, 2026

పురుగు మందుల తయారీదారులకు కఠిన నిబంధనలు

image

కేంద్రం తీసుకురానున్న నూతన చట్టం ప్రకారం ప్రతి డబ్బాపై పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీతో పాటు తయారీ సంస్థ చిరునామా, అందులో వాడిన రసాయనాల వివరాలను తప్పనిసరిగా ముద్రించాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించడంతో పాటు, QR కోడ్ ముద్రించి రైతులకు ఆ మందుల వివరాలు ఈజీగా తెలుసుకునేలా చేయాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో మాత్రమే ఉత్పత్తి జరగాలి. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు.