News June 4, 2024
రాజస్థాన్ ఒంటె ఎటువైపు తిరిగింది!
రాజస్థాన్ ఒంటె ఎటువైపు తిరిగిందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2019 ఎన్నికల్లో రాజస్థాన్ను బీజేపీ క్లీన్స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక్కడి 25 స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్ 11, ఇతరులు 3 స్థానాల్లో తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఎర్లీ ట్రెండ్స్ ఉండడం గమనార్హం.
Similar News
News October 7, 2024
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్లో మనిషి దంతం
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఆహారంలో బొద్దింక, బల్లులు, పురుగులు వచ్చిన ఘటనలు మరువకముందే ఓ వ్యక్తికి ఫుడ్లో మనిషి దంతాలు కనిపించాయి. పంజాబ్లోని ఢకోలికి చెందిన మనోజ్ అనే వ్యక్తి జొమాటోలో స్థానిక రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయగా అందులో మనిషి దంతాలు వచ్చినట్లు ఆరోపించారు. తినే ప్లేట్తోనే రెస్టారెంట్కు వెళ్లి మేనేజర్కు ఫిర్యాదు చేసి మనోజ్ గొడవ చేశారు.
News October 7, 2024
నటుడితో ఓలా ఎలక్ట్రిక్ ఓనర్ వాగ్వాదం: 9% క్రాషైన షేర్లు
వరెస్ట్ సర్వీస్ కంప్లైంట్లు, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్తో ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 43% తగ్గాయి. నటుడు కునాల్తో కంపెనీ ఓనర్ భవీశ్ అగర్వాల్ Xలో వాదనకు దిగడంతో నేడు 9% క్రాష్ అయ్యాయి. ‘భారత కస్టమర్లకు గొంతుందా? వాళ్లకిదేనా దక్కేది’ అంటూ దుమ్ముపట్టిన ఓలా స్కూటర్ల ఫొటోను కునాల్ పోస్ట్ చేశారు. ‘సాయం చేస్తే ఈ పెయిడ్ ట్వీట్, మీ ఫెయిల్డ్ కెరీర్లో సంపాదన కన్నా ఎక్కువే ఇస్తాన’ని భవీశ్ స్పందించారు.
News October 7, 2024
డిజిటల్ హెల్త్ కార్డులపై ఆ ప్రచారం అవాస్తవం: ప్రభుత్వం
TG: ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి తెలుగులో దరఖాస్తు ఫామ్ విడుదల చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. కార్డుల డిజైన్ ఇంకా ఫైనల్ కాలేదని, ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తుల ఫామ్ను రిలీజ్ చేయలేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఫేక్ దరఖాస్తులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.