News June 4, 2024

రాజ‌స్థాన్ ఒంటె ఎటువైపు తిరిగింది!

image

రాజ‌స్థాన్ ఒంటె ఎటువైపు తిరిగింద‌న్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 2019 ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌ను బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. అయితే ఇప్పుడు ప‌రిస్థితుల్లో భారీ మార్పు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇక్క‌డి 25 స్థానాల్లో బీజేపీ 11, కాంగ్రెస్ 11, ఇత‌రులు 3 స్థానాల్లో త‌మ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌కు భిన్నంగా ఎర్లీ ట్రెండ్స్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

Similar News

News December 5, 2025

iBOMMA రవికి జాబ్ ఆఫర్ చేయలేదు: డీసీపీ

image

iBOMMA రవికి తాము జాబ్ ఆఫర్ చేయలేదని, ప్రచారంలో ఉన్న వార్తలు అవాస్తవమని సైబర్ క్రైం DCP అరవింద్ బాబు తెలిపారు. 8 రోజుల కస్టడీలో కొన్నింటికి సమాధానం చెప్పాడని, తప్పు చేసిన బాధ అతనిలో లేదని వెల్లడించారు. 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు ఆధారాలు గుర్తించామన్నారు. ఆర్థిక లావాదేవీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందన్నారు. iBOMMAకు అనుబంధంగా ఉన్న మిర్రర్ సైట్లను మూసేసినట్లు డీసీపీ చెప్పారు.

News December 5, 2025

సంక్రాంతి బరిలో బాలకృష్ణ?

image

అనివార్య కారణాలతో బాలకృష్ణ అఖండ-2 మూవీ రిలీజ్ వాయిదా పడింది. అయితే మరో మూడు వారాలు ఆగితే సంక్రాంతి ఫీవర్ వచ్చేస్తుంది. వరుస సెలవులతో థియేటర్ల వద్ద సందడి నెలకొంటుంది. ఈ క్రమంలో సినిమాకు వచ్చిన అడ్డంకులు తొలగించుకుని వాయిదా పడిన అఖండ-2ను సంక్రాంతి బరిలో నిలిపే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అటు చిరంజీవి, ప్రభాస్‌తో సహా పలువురి సినిమాలు జనవరిలో రిలీజ్‌కు సిద్ధం అవుతున్నాయి.

News December 5, 2025

శుక్రవారం రోజున ఉప్పు కొంటున్నారా?

image

ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. అలాగే శుక్రవారమన్నా అమ్మవారికి ఇష్టమే. అందుకే శుక్రవారం రోజున ఉప్పు కొంటే చేసిన అప్పులు త్వరగా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలుగుతాయని అంటున్నారు. ‘సంపాదనలో భాగంగా మొదటి ఖర్చును ఉప్పుపైనే పెట్టడం ఎంతో శుభకరం. శుక్రవారం రోజున ఉప్పు కొంటే దారిద్ర్యం తొలగిపోతుంది. మంగళ, శని వారాల్లో ఉప్పు కొనకూడదు’ అని సూచిస్తున్నారు.