News December 11, 2024

2034లో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ఎక్కడంటే?

image

ప్రతిష్ఠాత్మక 2034 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఫిఫా ప్రకటించింది. మరోవైపు స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, అర్జెంటీనా, పరాగ్వే, ఉరుగ్వే దేశాలు సంయుక్తంగా 2030 వరల్డ్‌కప్ నిర్వహించనున్నాయని తెలిపింది. 2026 WCకు నార్త్ అమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక 2022లో అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News December 1, 2025

హైదరాబాద్‌లో 45 పోస్టులకు నోటిఫికేషన్

image

HYD సనత్‌నగర్‌లోని <>ESIC<<>> సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో 45 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టును బట్టి MD/MS, DM/M.CH ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు ఈ నెల 10, 11,12, 15, 16 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. జీతం నెలకు ప్రొఫెసర్‌కు రూ.2,56,671, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,70,681, Asst. ప్రొఫెసర్‌కు రూ.1,46,638, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: esic.gov.in

News December 1, 2025

మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

image

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?

News December 1, 2025

రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

image

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.