News September 8, 2024
వినాయకుడు మానవ ముఖంతో కనిపించే ఏకైక ఆలయం ఎక్కడుందంటే..

వినాయకుడి విగ్రహమంటే గజ ముఖంతోనే చూస్తుంటాం. తమిళనాడులోని తిలాతర్పణపురి ఆదివినాయకర్ ఆలయంలో మాత్రం మానవముఖంతో ఉన్న గణనాథుడు దర్శనమిస్తాడు. అమ్మవారు పసుపు నలుగు నుంచి తయారుచేసి ప్రాణం పోసిన గణేశుడు పరమశివుడు తల ఖండించిన తర్వాత గజాననుడిగా మారాడు. అమ్మవారు తొలిగా చేసిన బుజ్జి గణపయ్య రూపమే ఇక్కడ పూజలందుకుంటోంది. ఇక్కడ పిండప్రదానం పితృదేవతలకు ముక్తిదాయకమని ప్రతీతి.
Similar News
News November 22, 2025
BREAKING: కామారెడ్డి DCC అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే

తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిధిలోని జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అదిష్ఠానం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన నియామకాలలో భాగంగా, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఏలే నియమితులయ్యారు. కాగా ఈ పదవికి 30 మంది రేసులో ఉన్న విషయం విదితమే.
News November 22, 2025
వాస్తు ప్రకారం ఇంటికి ఏ రంగు ఉండాలి?

ఇంటికి లేత రంగులు (తెలుపు, లేత పసుపు) శ్రేయస్కరమని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇవి ఆహ్లాదకరమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని, చల్లదనాన్ని ఇస్తాయని తెలుపుతున్నారు. ‘చిన్న గదులు లేత రంగుల వలన విశాలంగా కనిపిస్తాయి. ఈ రంగులు సానుకూలతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయి. రంగుల ఎంపికలో సౌలభ్యం, ఆనందకరమైన అనుభూతికి ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్ద గదులకు డార్క్ రంగులైనా పర్లేదు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 22, 2025
బీసీలను ప్రభుత్వం నట్టేట ముంచింది: R.కృష్ణయ్య

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని నమ్మించి చివరికి ప్రభుత్వం నట్టేట ముంచిందని ఎంపీ R.కృష్ణయ్య మండిపడ్డారు. రిజర్వేషన్లపై సర్కార్ ఇవాళ జారీ చేసిన జీవో 46ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సూచించినట్లుగా ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, గదుల్లో కూర్చొని నివేదికలు సిద్ధం చేయడం బీసీలను రాజకీయంగా దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు.


