News September 27, 2024
ప్రవాస భారతీయులు ఏ దేశంలో ఎక్కువంటే..

భారతీయులు లేని దేశం లేదంటే అతిశయోక్తి కాదేమో! గ్లోబల్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం.. అత్యధికంగా అమెరికాలో 44 లక్షలమంది పైచిలుకు ప్రవాసీయులు నివసిస్తున్నారు. ఆ తర్వాత UAEలో 34.25 లక్షలమంది, మలేషియాలో 29.87 లక్షలు, సౌదీలో 25.94 లక్షలు, మయన్మార్లో 20.09 లక్షలు, UKలో 17.64 లక్షలు, కెనడాలో 16.89 లక్షలు, సౌతాఫ్రికాలో 15.60 లక్షలు, మారిషస్లో 8.94 లక్షలు, సింగపూర్లో 6.50లక్షలమంది నివసిస్తున్నారు.
Similar News
News January 31, 2026
ఇజ్రాయెల్ వలలో ట్రంప్.. ఎప్స్టీన్ ఫైల్స్లో దిమ్మతిరిగే నిజాలు!

ఎప్స్టీన్ తాజా ఫైల్స్ సంచలనం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ వలలో ట్రంప్ చిక్కుకున్నారని, ఆయన నిర్ణయాలపై ఆ దేశ ప్రభావం బలంగా ఉందని ఈ ఫైల్స్ వెల్లడించాయి. రష్యా పెట్టుబడులు, ఇజ్రాయెల్ అనుకూల నెట్వర్క్స్తో ట్రంప్ అల్లుడు కుష్నర్కు సంబంధాలు ఉండడంతో వైట్ హౌస్ నిర్ణయాలను ప్రభావితం చేశారని ఆరోపించాయి. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ Mossad కోసం ఎప్స్టీన్ లాయర్ పనిచేశారని ఈ రిపోర్ట్ పేర్కొనడం సంచలనంగా మారింది.
News January 31, 2026
సూర్యలానే సంజూను బ్యాకప్ చేయాలి: రైనా

NZతో జరుగుతున్న T20 సిరీస్లో ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న సంజూకు మాజీ ప్లేయర్ సురేశ్ రైనా మద్దతుగా నిలిచారు. కెప్టెన్ సూర్యకుమార్ ఏడాది పాటు రన్స్ చేయలేకపోయినా టీమ్ మేనేజ్మెంట్ అతడిని బ్యాకప్ చేసిందని చెప్పారు. సంజూ విషయంలోనూ ఇలాగే జరగాలన్నారు. అతనికి అవకాశాలు ఇస్తూ ఉంటే కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారని రైనా అభిప్రాయం వ్యక్తం చేశారు. NZతో జరిగిన తొలి 4 T20ల్లో సంజూ 40 పరుగులే చేశారు.
News January 31, 2026
ఒక అబద్ధానికి పుట్టిన మహా అబద్ధం: YCP

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని YCP వాదిస్తోంది. మరోవైపు ‘మహా పాపం నిజం’ అని పలు ప్రాంతాల్లో TDP ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ నేపథ్యంలో YCP చేసిన తాజా ట్వీట్ సంచలనంగా మారింది. ‘ఒక అబద్ధానికి పుట్టిన మహా అబద్ధం నారా లోకేశ్’ అంటూ CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ను టార్గెట్ చేసింది.


