News October 9, 2025

దీపావళి ఏ రోజు జరుపుకోవాలంటే?

image

అక్టోబర్ 20, 21 తేదీల్లో అమావాస్య తిథి ఉండటంతో.. ఈ ఏడాది దీపావళి ఏ రోజు జరుపుకోవాలన్న గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’ దీనిపై క్లారిటీ ఇచ్చింది. దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి ప్రదోషకాలం (5.46 PM-8.18 PM)ఆరోజు ఉంటుందని వెల్లడించింది. లక్ష్మీపూజ కూడా అదే రోజు రా.7.08-రా.8.18 మధ్య జరుపుకోవచ్చని తెలిపింది.

Similar News

News October 9, 2025

గ్యాస్ సిలిండర్ ఎక్స్‌పైరీ తేదీని చెక్ చేయండిలా!

image

ఇంట్లో నెలల తరబడి గ్యాస్ సిలిండర్ ఉంచుతున్నారా? ఇది ప్రమాదమే. ఎందుకంటే వాటికీ ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. సురక్షితమైన వాడకం కోసం దీనిని నిర్ణయించారు. దీనిని సిలిండర్ పైభాగంలో ముద్రిస్తారు. ఉదా.. ‘C-27’ అని ఉంటే 2027లో JUL- SEP మధ్య ముగుస్తుందని అర్థం. A అని ఉంటే JAN TO MAR, B- APR TO JUN, C-JULY TO SEP, D- OCT TO DEC అని తెలుసుకోవాలి. గడువైపోయిన వాటిని వాడకుండా ఉంటే ప్రమాదాలు జరగవు. SHARE IT

News October 9, 2025

గ్రూప్1 నియామకాలపై జోక్యానికి సుప్రీం నో

image

తెలంగాణలో గ్రూప్1 నియామకాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఇదే అంశంపై ఈనెల 15న హైకోర్టులో విచారణ ఉన్న సమయంలో తాము ఇందులో జోక్యం చేసుకోబోమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. కాగా హైకోర్టు తుది తీర్పుకు లోబడే నియామకాలు ఉంటాయని ప్రకటించింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యర్థులను సెలక్ట్ చేసింది.

News October 9, 2025

భారత్ నుంచి నోబెల్ అందుకున్నది వీరే..

image

<<17948949>>నోబెల్<<>> పురస్కారం అందుకున్న తొలి భారతీయుడిగా రవీంద్రనాథ్ ఠాగూర్(1913-సాహిత్యం) నిలిచారు. 1930లో సి.వి.రామన్(ఫిజిక్స్), 1979లో మదర్ థెరిసా(శాంతి), 1998లో అమర్త్యసేన్(అర్థశాస్త్రం), 2014లో కైలాశ్ సత్యార్థి(శాంతి) ఈ జాబితాలో ఉన్నారు. భారత సంతతి వారిలో హరగోవింద్ ఖొరానా(వైద్యశాస్త్రం), సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్(ఖగోళ భౌతిక), వెంకట్రామన్ రామకృష్ణన్(రసాయన), అభిజిత్ బెనర్జీ(అర్థశాస్త్రం) ఉన్నారు.