News October 23, 2024
ఇండియాలోనే అత్యంత నెమ్మదైన రైలు ఏదంటే..

హౌరా-అమృత్సర్ రైలుకు అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా పేరుంది. 111 స్టేషన్లలో ఆగుతూ వెళ్లడం వల్ల ఆఖరి స్టేషన్కు చేరుకునేందుకు 37 గంటలు పడుతుంటుంది. బెంగాల్, బిహార్, యూపీ, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా 1910 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈరోజు రాత్రి 7.15 గంటలకు హౌరా స్టేషన్లో బయలుదేరితే ఎల్లుండి ఉదయం 8.40 గంటలకు అమృత్సర్ చేరుతుంది. టికెట్ ధర తక్కువే కావడంతో ఈ రైలుకు డిమాండ్ ఎక్కువే.
Similar News
News October 23, 2025
WWC: ప్రతీకా రావల్ సెంచరీ

న్యూజిలాండ్తో మ్యాచులో మరో ఓపెనర్ ప్రతీకా రావల్ కూడా సెంచరీ చేశారు. 122 బంతుల్లో 13 ఫోర్లతో శతకం నమోదు చేశారు. ఇప్పటికే సెంచరీ చేసిన స్మృతి మంధాన 109 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. వీరిద్దరూ 212 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం ప్రతీకాతో పాటు రోడ్రిగ్స్ క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 38.1 ఓవర్లకు 239/1.
News October 23, 2025
నిబంధనలు పాటించని కాలేజీలపై ఫిర్యాదు చేయండి: APSCHE

AP: కొన్ని కాలేజీలు GOVT రూల్స్ పాటించడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE) తెలిపింది. ‘కన్వీనర్ కోటా సీట్లు పొందిన వారి నుంచి అధిక ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇవ్వకుంటే అడ్మిషన్ నిరాకరిస్తున్నాయి. కాలేజీల్లో ర్యాగింగ్ నిరోధ చర్యలు తీసుకోవడం లేదు. మహిళలపై వేధింపుల నివారణలోనూ విఫలమవుతున్నాయి’ అని పేర్కొంది. వీటిపై తమకు లేదా వర్సిటీకి, APHERMCకి ఫిర్యాదు చేయాలని సూచించింది.
News October 23, 2025
వరిలో కంపు నల్లి – నివారణకు సూచనలు

ఖరీఫ్ వరి పంటలో గింజ పాలు పోసుకొనే దశలో కంపు నల్లి ఆశించడం వల్ల గింజపై నల్లని మచ్చలు ఏర్పడి, గింజలు తాలుపోతాయి. నవంబరు వరకు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బూడిద, ఆకుపచ్చ రంగులోని నల్లి పురుగులు పంటను ఆశిస్తాయి. వీటి వల్ల పొలంలో చెడు వాసన వస్తుంది. ఈ నల్లిని సాయంత్రం వేళ పొలంలో గమనించవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా మలాథియాన్ 2ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.