News April 5, 2024
8 కులాల వ్యక్తులు గెలిచిన సెగ్మెంట్ ఏదంటే?

APలో రాజమండ్రి అర్బన్ సెగ్మెంట్కు ప్రత్యేక స్థానం ఉంది. 8 కులాల వ్యక్తులు గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. కమ్మ- ప్రభాకర్ చౌదరి(1952, 67), బుచ్చయ్య చౌదరి(1983, 85, 94, 99), కాపు-వీరభద్రరావు(1962), సత్యనారాయణ(2014), రెడ్డి- ACY రెడ్డి(1989), కొప్పుల వెలమ- ఆదిరెడ్డి భవాని(2019), బ్రాహ్మణ-నాగేశ్వరరావు(1955), వైశ్య-సత్యవతి(1978), తూర్పు కాపు-రౌతు సూర్యప్రకాశ్(2004,09), పద్మశాలి-మల్లికార్జునరావు(1972).
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 27, 2025
KMR: ఈనెల 30తో ముగియనున్న మక్కల కొనుగోళ్లు

కామారెడ్డి జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు మార్క్ ఫెడ్ కీలక సూచన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోళ్లు ఈ నెల 30వ తేదీతో ముగియనున్నాయని కామారెడ్డి జిల్లా మార్క్ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి శనివారం తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, తమ వద్ద ఉన్న దిగుబడిని వెంటనే సమీప కేంద్రాలకు తరలించాలని ఆయన సూచించారు.
News December 27, 2025
రైతు రామారావు ఫ్యామిలీకి అండగా ఉంటాం: CBN

AP: తన సమస్యను చెప్పుకొని గుండెపోటుతో మరణించిన అమరావతి రైతు రామారావు కుటుంబ సభ్యులను CM CBN ఫోన్లో పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా నిన్న మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో రైతు <<18679475>>రామారావు<<>> ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తెలిసిందే. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన మరణించారు.
News December 27, 2025
మండలాలు పక్క జిల్లాల్లోకి!

AP: <<18685889>>పునర్విభజనలో<<>> గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు నియోజకవర్గంలోని 5 మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని CM చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో, రైల్వే కోడూరును తిరుపతిలో, పొదిలిని ప్రకాశంలో, రాజంపేటను కడపలో, రాయచోటి(అన్నమయ్య)ని మదనపల్లెలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అటు ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలని అభిప్రాయపడ్డారు.


