News August 23, 2024

ఏ రాష్ట్రంలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయంటే?

image

దేశంలో ప్రతి ఊరుకో గుడి ఉండటం సహజం. అయితే, అత్యధికంగా గుళ్లు ఉన్న రాష్ట్రాల గురించి తెలుసుకుందాం. తమిళనాడులో ఎక్కువగా 79,154 టెంపుల్స్ ఉన్నాయి. మహారాష్ట్రలో 77,283, కర్ణాటకలో 61,232, వెస్ట్ బెంగాల్‌లో 53,658, గుజరాత్‌లో 49,995, ఆంధ్రప్రదేశ్‌లో 47,152, రాజస్థాన్‌లో 39,392, ఉత్తర్‌ప్రదేశ్‌లో 37,518, ఒడిశాలో 30,877, బిహార్‌లో 29,748, తెలంగాణలో 28,312, మధ్యప్రదేశ్‌లో 27,947 దేవాలయాలున్నాయి.

Similar News

News February 14, 2025

ఫిబ్రవరి 14: చరిత్రలో ఈరోజు

image

1898: స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత దిగవల్లి వేంకటశివరావు జననం
1921: ఆంధ్రప్రదేశ్ రెండో సీఎం దామోదరం సంజీవయ్య జననం
1952: మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ జననం
1974: సినీ దర్శకుడు, నిర్మాత వి.రామచంద్ర రావు మరణం
1983: తెలుగు సినిమా హాస్యనటుడు రాజబాబు మరణం
1984: నటుడు సి.హెచ్. నారాయణరావు మరణం
2019: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్ల వీరమరణం
☛ ప్రేమికుల దినోత్సవం

News February 14, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 14, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.41 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.31 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 14, 2025

మస్క్‌తో ఈ అంశాలపైనే చర్చించా: PM మోదీ

image

USలో పర్యటనలో ఉన్న PM మోదీ ఎలాన్ మస్క్‌తో భేటీ అయినట్లు ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు పేర్కొన్నారు. యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్‌జ్, వివేక్ రామస్వామితోనూ PM చర్చలు జరిపారు.

error: Content is protected !!