News July 16, 2024
ఆ MLAలను ఏ రాయితో కొట్టాలి: KTR

TG: తమ పార్టీ MLAలను తీసుకొని కాంగ్రెస్ మురిసిపోతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ అన్నారని, ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్లిన వారిని ఏ రాయితో కొట్టాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీలు వేరే పార్టీలోకి వెళ్లిపోతే ఆ పార్టీని ఎవరు కాపాడుతారని KTR అడిగారు. విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ వేసి కాంగ్రెస్ తన గొయ్యి తానే తవ్వుకుంటోందన్నారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


