News March 23, 2024
IPL 2024 టైటిల్ విజేత ఆ జట్టే?
IPL 2024 టైటిల్ విజేతగా సీఎస్కే జట్టు నిలుస్తుందని క్రిక్ ట్రాకర్ అంచనా వేసింది. ఆ జట్టుకు 20 శాతం టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ముంబై ఇండియన్స్ (15 శాతం), సన్రైజర్స్ హైదరాబాద్ (12), ఆర్సీబీ (10), కోల్కతా నైట్రైడర్స్ (8), ఢిల్లీ క్యాపిటల్స్ (8), రాజస్థాన్ రాయల్స్ (8), గుజరాత్ టైటాన్స్ (8), లక్నో సూపర్ జెయింట్స్ (6), పంజాబ్ కింగ్స్ 5 శాతం గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
Similar News
News October 6, 2024
దీపావళికి నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’
సుధీర్ వర్మ డైరెక్షన్లో నిఖిల్ హీరోగా నటిస్తున్న మూవీ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు. ఆ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ టైటిల్ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మూవీలో రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
News October 6, 2024
ఆకస్మిక వరదలు.. ఒకే కుటుంబంలో ఏడుగురు సమాధి
భారీ వర్షాల కారణంగా మేఘాలయలో ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. 24 గంటల వ్యవధిలో 10 మంది మరణించారు. సౌత్గారో హిల్స్ జిల్లాలోని గసుఆపారాలో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డాలు ప్రాంతంలో ముగ్గురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన సీఎం కాన్రాడ్ కె సంగ్మా వారికి వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.
News October 6, 2024
జానీ మాస్టర్ అవార్డును ఆపడం మూర్ఖత్వమే: నటుడు
పోక్సో చట్టం కింద కేసు నమోదవడంతో జానీ మాస్టర్కు దక్కిన నేషనల్ అవార్డును తాత్కాలికంగా నిలిపివేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ నిర్ణయాన్ని నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఖండించారు. ‘కేసు రుజువయ్యేవరకు జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. మీరేమి పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా. తన కొరియోగ్రఫీ టాలెంట్కు, తన వ్యక్తిగత జీవితంతో సంబంధం ఏంటి? ఇది మూర్ఖత్వమే. సారీ’ అని ట్వీట్ చేశారు.