News March 23, 2024

IPL 2024 టైటిల్ విజేత ఆ జట్టే?

image

IPL 2024 టైటిల్ విజేతగా సీఎస్కే జట్టు నిలుస్తుందని క్రిక్ ట్రాకర్ అంచనా వేసింది. ఆ జట్టుకు 20 శాతం టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అలాగే ముంబై ఇండియన్స్ (15 శాతం), సన్‌రైజర్స్ హైదరాబాద్ (12), ఆర్సీబీ (10), కోల్‌కతా నైట్‌రైడర్స్ (8), ఢిల్లీ క్యాపిటల్స్ (8), రాజస్థాన్ రాయల్స్ (8), గుజరాత్ టైటాన్స్ (8), లక్నో సూపర్ జెయింట్స్ (6), పంజాబ్ కింగ్స్ 5 శాతం గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

Similar News

News November 18, 2025

ఎన్‌కౌంటర్స్‌ మొత్తం ఫేక్: కూనంనేని

image

మావోయిస్టులపై జరుగుతున్న ఎన్‌కౌంటర్లు మొత్తం ఫేక్ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడం మానవ హననమేనని, ఇది జంగిల్‌ రాజ్‌ పరిపాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఇందులో పావులుగా మారారని ఆరోపించారు. మాడేరుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్‌కౌంటర్‌తో సహా అన్ని ఎన్‌కౌంటర్లు కట్టుకథలని ఆయన స్పష్టం చేశారు.

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.