News October 10, 2025
నోబెల్ కమిటీపై వైట్హౌజ్ విమర్శలు

ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడంపై వైట్హౌజ్ స్పందించింది. ‘తాము శాంతి కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని మరోసారి నోబెల్ కమిటీ నిరూపించింది. అయినా ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు ఆపేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయన మానవతావాది. శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడతారు’ అని వైట్హౌజ్ అధికార ప్రతినిధి స్టీవెన్ చుయెంగ్ ‘X’ వేదికగా విమర్శించారు.
Similar News
News October 10, 2025
AP క్యాబినెట్ కీలక నిర్ణయాలు

*రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం
*పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా మార్చేందుకు అనుమతి
*పంచాయతీల వర్గీకరణకు ఆమోదం
*13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్పు
*విశాఖలో రూ.87వేల కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం
*గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాల భూమి కేటాయింపు
News October 10, 2025
రేపు ఉదయం లోగా వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30గంటల లోపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలకు ఛాన్స్ ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?
News October 10, 2025
నోబెల్ ప్రైజ్ ప్రతిష్ఠ కోల్పోయింది: పుతిన్

NOBEL పీస్ ప్రైజ్కు వెనిజులా విపక్ష నేత మరియా ఎంపికవడం తెలిసిందే. దీనిపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పందించారు. ‘ట్రంప్ అన్నివిధాలా అర్హులు. మిడిల్ ఈస్ట్లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు. శాంతికోసం పనిచేయని పలువురికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది తన ప్రతిష్ఠను కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. అటు ‘శాంతిపై నోబెల్వి మాటలే. ట్రంప్ చేసి చూపించారు. ప్రైజ్కు అర్హులు’ అని నెతన్యాహు అన్నారు.