News October 16, 2024
‘అతిరథ మహారథులు’ అంటే ఎవరు?
రాజకీయ సభల్లో వేదికపై ఉన్న అతిరథ మహారథులు అంటూ ప్రసంగాలు మొదలుపెడుతుంటారు. అసలు ఆ పదాన్ని ఎవరికి వాడాలి? అతిరథ మహారథులు అంటే ఎవరు? అనే విషయాన్ని తెలుసుకుందాం. యుద్ధంలో పాల్గొన్న యోధుల సామర్థ్యాన్ని తెలిపేందుకు ఈ పదాన్ని వాడతారు. ఏకకాలంలో 5వేల మందితో యుద్ధం చేసేవారిని రథి అని, 60వేల మందితో యుద్ధం చేస్తే అతిరథ అని, 7లక్షల మందితో యుద్ధం చేసేవారిని మహారథి అని అంటారు. వీరు మాత్రమే ఆ పిలుపునకు అర్హులు.
Similar News
News October 16, 2024
రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP: భారీ నుంచి అతిభారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో రేపు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు సెలవు ఉండనుంది. పలు జిల్లాల్లో కలెక్టర్లు సెలవు ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News October 16, 2024
రాష్ట్రంలో ఈ రోడ్లకు మహర్దశ
APలో పలు రహదారులను కేంద్రం అభివృద్ధి చేయనుంది. కొండమోడు-పేరేచర్ల మధ్య 49.91K.M దూరాన్ని రూ.883.61కోట్లతో 4 లేన్లుగా అభివృద్ధి చేయనుంది. సత్తెనపల్లి, మేడికొండూరులో బైపాస్లు నిర్మించనుండడంతో, HYD-గుంటూరు మధ్య రాకపోకలకు సులువు అవుతుంది. సంగమేశ్వరం-నల్లకాలువ, వెలుగోడు-నంద్యాల మధ్య 62.571K.Mను రూ.601.14 కోట్లతో, నంద్యాల-కర్నూలు/కడప సరిహద్దుల మధ్య 62.01K.M దూరాన్ని ₹691.81 కోట్లతో అభివృద్ధి చేయనుంది.
News October 16, 2024
తెలంగాణలో రిపోర్టు చేసిన ఏపీ ఐఏఎస్లు
ఏపీ ఐఏఎస్లు సృజన, శివశంకర్ తెలంగాణ సీఎస్ శాంతికుమారికి రిపోర్ట్ చేశారు. తెలంగాణలో రిపోర్ట్ చేయాల్సిందిగా వీరిని డీవోపీటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ నుంచి నలుగురు ఐఏఎస్లు ఏపీకి వెళ్లనున్నారు. ఐపీఎస్లకు కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో అంజనీ కుమార్, అభిలాష బిస్త్ TGలోనే కొనసాగనున్నారు.